విజయవాడ నుంచి హజ్యాత్రకు ప్రత్యేక విమానాలు- డిప్యూటీ సిఎం అంజాద్బాషా
- May 24, 2023అమరావతి: జూన్ 7 నుంచి 19 వరకు విజయవాడ నుంచి హజ్యాత్రకు వెళ్లేవారి కోసం ఏర్పాట్లు చేసినట్లు డిప్యూటీ సిఎం అంజాద్ బాషా తెలిపారు. ఈ ఏడాది గన్నవరం ఎయిర్పోర్టులో ఏర్పాటుచేసిన ఎంబార్కేషన్ పాయింట్ నుంచి 1,813 మంది యాత్రికులను నేరుగా హజ్యాత్రకు పంపిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ యాత్రలో భాగంగా ప్రతిరోజూ 155 మంది హజ్యాత్రకు వెళ్లేలా ఏర్పాట్లు చేశామన్నారు. వివిధ ఎయిర్లైన్స్ రాష్ట్రం నుంచి యాత్రికులను హజ్కు తీసుకెళ్లి మరలా తిరిగి హజ్నుంచి రాష్ట్రానికి తీసుకొచ్చేలా ఇప్పటికే టెండర్లు పిలిచామన్నారు. గుంటూరు జిల్లా నంబూరు మదరసాలో వసతి కల్పన, ఎసి బస్సుల ద్వారా గన్నవరం ఎయిర్పోర్టుకు యాత్రికులను చేర్చే సౌకర్యం ప్రభుత్వం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!
- సలాలా ఆటిజం సెంటర్.. ఆటిస్టిక్ పిల్లలకు వరం..!
- కాలువల్లో చనిపోయిన చేపలు.. మున్సిపాలిటీ క్లారిటీ
- యాంటీబయాటిక్స్ నిల్..పుకార్లను నమ్మొద్దు
- 15 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు.. అలర్ట్ జారీ
- 'రామాయణం' షూటింగ్ సెట్ నుంచి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు లీక్..
- ముంబైలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం
- తిరుమలలో భక్తుల రద్దీ..దర్శనానికి 18 గంటలు
- వైసీపీ మ్యానిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్..
- ట్రంప్ తో డిబేట్ కు నేను సిద్ధం: బైడెన్