తిరుమలలో భక్తుల రద్దీ..దర్శనానికి 18 గంటలు
- April 27, 2024
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. టోకెన్లు లేని భక్తుల శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న 57 వేల 909 మంది స్వామివారిని దర్శించుకున్నారు. హుండీకి రూ.3.81 కోట్ల ఆదాయం సమకూరింది. తిరుమల శ్రీవారి సేవలో పాలుపంచుకునే అవకాశం కల్పిస్తోంది టీటీడీ.. శ్రీవారి సేవలో భాగంగా టీటీడీకి చెందిన అన్ని విభాగాల్లోనూ భక్తులు పాలుపంచుకుంటారు. స్వామివారి సేవ కోసంవచ్చిన వారికి భోజనం, బసతోపాటు చివరి రోజు స్వామి దర్శనభాగ్యం కల్పిస్తోంది టీటీడీ. 2000లో శ్రీవారి సేవ వ్యవస్థను తీసుకొచ్చింది టీటీడీ. తిరుమలకు వచ్చే భక్తుల రద్దీని నియంత్రించడం, ఇతర సేవల్లో పాల్గొనడానికి ఆసక్తి చూపే వారి కోసం శ్రీవారి సేవకులు పేరుతో ప్రత్యేకంగా ఓ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. టీటీడీ వెబ్సైట్, యాప్ ద్వారా భక్తులు తమ పేరు, ఇతర వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- ప్రమాదకరమైన స్టంట్ డ్రైవింగ్..షాకిచ్చిన దుబాయ్ పోలీసులు..!!
- ఉగ్రదాడిని ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఖతార్ లో 8500 దాటిన ఫ్రీ, రాయితీ ప్రైవేట్ స్కూల్స్ సీట్లు..!!
- బహ్రెయిన్ తదుపరి రాయబారిగా ప్రదీప్ సింగ్ నియామకం..!!
- జూన్ 1 నుండి విదేశీ విమాన సర్వీసులు పునఃప్రారంభం..!!
- సైనిక హజ్ బృందానికి అధికారులు వీడ్కోలు..!!
- తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్
- విజయవాడలో అర్థరాత్రి హైడ్రామా
- జూన్ 1 నుంచి దుబాయ్ పార్కింగ్ సేవలపై 5% వ్యాట్...పార్కిన్, సాలిక్ కీలక ప్రకటన
- అబూదాబిలో ప్రారంభం కానున్న సోను నిగమ్ వరల్డ్ టూర్









