ప్రముఖ నటుడు చంద్రమోహన్ కు ఎన్.టీ.ఆర్ అవార్డు
- May 24, 2023
హైదరాబాద్: వంశీ ఇంటర్నేషనల్ ఇండియా నిర్వహణలో విఖ్యాత నటుడు నందమూరి తారక రామారావు శత జయంతి ముగింపు వేడుకల్లో భాగంగా ప్రముఖ నటుడు చంద్రమోహన్ కు ఎన్.టీ.ఆర్ అవార్డు, ఫిల్మ్ నగర్ లోని ఆయన స్వగృహంలో లక్ష్మీనారాయణ ముఖ్య అతిధిగా పాల్గొని బహుకరించారు.విశ్రాంత జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ... నేడు సినిమా క్రికెట్, క్రైమ్ సమాజాన్ని ప్రభావితం చేస్తున్నాయని కుటుంబ వ్యవస్థ ను బలీయం చేసే చిత్రాలకు ఆదరణ లేదని లక్ష్మీ నారాయణ ఆన్నారు.కుటుంబ కధా చిత్రాలలో చంద్ర మోహన్ నటన విలక్షణ మన్నారు. ఎన్.టి.ఆర్ వంటి మహోన్నత నటుడు తెలుగు వారు కావటం జాతి అంతా గర్వించాలని అన్నారు. దర్శకుడు రేలంగి నరసింహా రావు మాట్లాడుతూ...చంద్ర మోహన్ తో తాను 25 సినిమాలకు దర్శకత్వం వహించనని మంచి ఈజ్ ఉన్న నటుడని అభినందించారు. వంశీ రామరాజు నిర్వహించిన కార్యక్రమంలో జలందర చంద్ర మోహన్ దైవజ్ఞ శర్మ,దేశాయి, శ్రీదేవి, శైలజ, డాక్టర్ సుధ, రాశీ మూవీస్ నర సింహారావు తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తలు
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..
- యూఏఈని ముంచెత్తిన వర్షాలు..వేడి నుంచి ఉపశమనం..!!
- మిస్సైల్ అటాక్..అడ్డుకున్న ఖతార్..!!









