తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. రూ.500లకే గ్యాస్ సిలిండర్: రేవంత్ రెడ్డి
- May 26, 2023
హైదరాబాద్: తెలంగాణ లో మరో ఐదు , ఆరు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ క్రమంలో అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్దమవుతున్నాయి. రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బిఆర్ఎస్ మరోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తుంది. అలాగే కాంగ్రెస్ , బిజెపి పార్టీలు సైతం ఈసారి ఎలాగైనా తెలంగాణాలో గెలిచి తీరాలని ట్రై చేస్తున్నాయి. ఈ క్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ వాగ్దానాలు చేయడం మొదలుపెట్టారు.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. రూ.500లకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని మాటిచ్చారు. కాంగ్రెస్ పీపుల్ మార్చ్ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ఎంతో చరిత్ర ఉన్న పాలమూరును అధికారంలోకి వచ్చిన వెంటనే అభివృద్ధి చేస్తామన్న సీఎం కేసీఆర్ వాగ్ధానం ఏమయ్యింది అని ప్రశ్నించారు. బ్రతుకు దెరువు కోసం ఉన్న ఊరిని వదిలి లక్షల మంది వలస పోతున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..









