తెలుగుదేశం మహానాడుకు ఏర్పాట్లు పూర్తి..
- May 26, 2023అమరావతి: తెలుగుదేశం మహానాడు రేపటి (శనివారం) నుంచి ప్రారంభం కానుంది. మహానాడు 2రోజులపాటు జరుగనుంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని వేమగిరిలో టీడీపీ మహానాడు నిర్వహించనున్నారు. ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ఈ మహానాడును ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు తెలుగుదేశం పార్టీ సన్నద్ధం అవుతుంది. సన్నాహక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం అధినేత చంద్రబాబు, నారా లోకేష్ రాజమండ్రికి రానున్నారు.
సాయంత్రం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరుగనుంది. మహానాడు అజెండాతో పాటు రానున్న రోజుల్లో పార్టీ పరంగా అనుసరించే రాజకీయ విధానాలను పొలిట్ బ్యూరో ఖరారు చేయనుంది. మహానాడులో ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు పార్టీ అధినాయకత్వ పర్యవేక్షణలో భారీగా ఏర్పాట్లు చేశారు.
దాదాపు 200 ఎకరాల విస్తీర్ణంలో ఈసారి మహానాడు వేడుక జరుగనుంది. మే27న సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో ప్రతినిధుల సభ ఉంటుంది. మే28న సుమారు 60 ఎకరాల విస్తీర్ణంలో మహనాడు బహిరంగ సభ నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. పార్కింగ్, భోజన స్టాళ్లకు సుమారు 140 ఎకరాల మేర కేటాయించారు. మే27న నిర్వహించే ప్లీనరీ ప్రాంతంలో సుమారు లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రధాన వేదికను నిర్మించారు.
ఎన్టీఆర్, చంద్రబాబు పరిపాలనలో పేదలకు అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి, చంద్రబాబు హయాంలో రాష్ట్రాభివృద్ధికి విదేశాలు వెళ్లి పెట్టుబడులు తెచ్చేందుకు చేసిన కృషి తదితర అంశాలను నేటి తరానికి తెలియజేసేలా డిజిటల్ ఫొటో ఎగ్జిబిషన్ లు ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల పర్వం..
- కాంగ్రెస్ పార్టీ నేషనల్ స్టార్ క్యాంపెయినర్గా కీలక బాధ్యతలు
- అయోధ్యలోని బాల రాముడి నుదుటిపై తిలకం దిద్దిన సూర్య భగవానుడు
- భారీ వర్షాలు..ఎమిరేట్స్ ప్రయాణికులకు చెక్-ఇన్ నిలిపివేత
- ఒమన్లో భారీ వర్షాలు.. జనజీవనం అస్తవ్యస్తం
- తూర్పు ప్రావిన్స్లో భారీ వర్షం.. రియాద్లో అలెర్ట్ జారీ
- భారీ వర్షాలతో విద్యుత్, ఇంటర్నెట్,మంచినీటి సమస్యలు..!
- దుబాయ్ లో మెట్రో సేవలకు అంతరాయం
- సాల్మియాలో ఇద్దరు ప్రవాసులు అరెస్ట్
- భద్రాద్రిలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం..