తెలుగుదేశం మహానాడుకు ఏర్పాట్లు పూర్తి..
- May 26, 2023
అమరావతి: తెలుగుదేశం మహానాడు రేపటి (శనివారం) నుంచి ప్రారంభం కానుంది. మహానాడు 2రోజులపాటు జరుగనుంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని వేమగిరిలో టీడీపీ మహానాడు నిర్వహించనున్నారు. ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ఈ మహానాడును ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు తెలుగుదేశం పార్టీ సన్నద్ధం అవుతుంది. సన్నాహక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం అధినేత చంద్రబాబు, నారా లోకేష్ రాజమండ్రికి రానున్నారు.
సాయంత్రం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరుగనుంది. మహానాడు అజెండాతో పాటు రానున్న రోజుల్లో పార్టీ పరంగా అనుసరించే రాజకీయ విధానాలను పొలిట్ బ్యూరో ఖరారు చేయనుంది. మహానాడులో ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు పార్టీ అధినాయకత్వ పర్యవేక్షణలో భారీగా ఏర్పాట్లు చేశారు.
దాదాపు 200 ఎకరాల విస్తీర్ణంలో ఈసారి మహానాడు వేడుక జరుగనుంది. మే27న సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో ప్రతినిధుల సభ ఉంటుంది. మే28న సుమారు 60 ఎకరాల విస్తీర్ణంలో మహనాడు బహిరంగ సభ నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. పార్కింగ్, భోజన స్టాళ్లకు సుమారు 140 ఎకరాల మేర కేటాయించారు. మే27న నిర్వహించే ప్లీనరీ ప్రాంతంలో సుమారు లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రధాన వేదికను నిర్మించారు.
ఎన్టీఆర్, చంద్రబాబు పరిపాలనలో పేదలకు అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి, చంద్రబాబు హయాంలో రాష్ట్రాభివృద్ధికి విదేశాలు వెళ్లి పెట్టుబడులు తెచ్చేందుకు చేసిన కృషి తదితర అంశాలను నేటి తరానికి తెలియజేసేలా డిజిటల్ ఫొటో ఎగ్జిబిషన్ లు ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు
- డా.పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం
- పెట్రోల్, డీజిల్ సరఫరా పై కేంద్రం కీలక నిర్ణయం
- కార్మికులకు మే డే శుభాకాంక్షలు చెప్పిన కేసీఆర్
- యూఏఈలో పాఠశాలలకు 9 రోజుల ఈద్ అల్ అధా సెలవులు
- కార్మికులకు సీఎం రేవంత్ మేడే శుభాకాంక్షలు
- 2027 మార్చి 31 నాటికి తెలంగాణ నుంచి 1,000 వ్యాపారాలను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యం
- IPL 2026: బెంగళూరు పై గుజరాత్ ఘనవిజయం!
- మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్
- గల్ఫ్ ప్రయాణికులకు బిగ్ రిలీఫ్









