తెలుగుదేశం మహానాడుకు ఏర్పాట్లు పూర్తి..
- May 26, 2023
అమరావతి: తెలుగుదేశం మహానాడు రేపటి (శనివారం) నుంచి ప్రారంభం కానుంది. మహానాడు 2రోజులపాటు జరుగనుంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని వేమగిరిలో టీడీపీ మహానాడు నిర్వహించనున్నారు. ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ఈ మహానాడును ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు తెలుగుదేశం పార్టీ సన్నద్ధం అవుతుంది. సన్నాహక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం అధినేత చంద్రబాబు, నారా లోకేష్ రాజమండ్రికి రానున్నారు.
సాయంత్రం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరుగనుంది. మహానాడు అజెండాతో పాటు రానున్న రోజుల్లో పార్టీ పరంగా అనుసరించే రాజకీయ విధానాలను పొలిట్ బ్యూరో ఖరారు చేయనుంది. మహానాడులో ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు పార్టీ అధినాయకత్వ పర్యవేక్షణలో భారీగా ఏర్పాట్లు చేశారు.
దాదాపు 200 ఎకరాల విస్తీర్ణంలో ఈసారి మహానాడు వేడుక జరుగనుంది. మే27న సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో ప్రతినిధుల సభ ఉంటుంది. మే28న సుమారు 60 ఎకరాల విస్తీర్ణంలో మహనాడు బహిరంగ సభ నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. పార్కింగ్, భోజన స్టాళ్లకు సుమారు 140 ఎకరాల మేర కేటాయించారు. మే27న నిర్వహించే ప్లీనరీ ప్రాంతంలో సుమారు లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రధాన వేదికను నిర్మించారు.
ఎన్టీఆర్, చంద్రబాబు పరిపాలనలో పేదలకు అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి, చంద్రబాబు హయాంలో రాష్ట్రాభివృద్ధికి విదేశాలు వెళ్లి పెట్టుబడులు తెచ్చేందుకు చేసిన కృషి తదితర అంశాలను నేటి తరానికి తెలియజేసేలా డిజిటల్ ఫొటో ఎగ్జిబిషన్ లు ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..









