అబుధాబి హిందూ దేవాలయాన్ని సందర్శించిన 30 దేశాల రెసిడెంట్ అంబాసిడర్లు
- May 26, 2023అబుధాబి: యూఏఈలోని భారత రాయబారి సంజయ్ సుధీర్ ప్రత్యేక ఆహ్వానం మేరకు 30 కంటే ఎక్కువ దేశాల రెసిడెంట్ అంబాసిడర్లు, దౌత్య సంఘం సభ్యులు మే 25 మేన అబుధాబిలో BAPS హిందూ దేవాలయ సముదాయాన్ని సందర్శించారు. 2018లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసినప్పటి నుండి ఆలయ పురోగతిని సంజయ్ సుధీర్ వారికి వివరించారు. భారతదేశం, ఇతర దేశాల మధ్య ఉన్న సన్నిహిత, చారిత్రాత్మక మరియు సాంస్కృతిక బంధాలకు ప్రతీకగా BAPS హిందూ దేవాలయ ప్రాజెక్టు అని అభివర్ణించారు.
హిందూ మందిర్ ప్రాజెక్టుకు నాయకత్వం వహిస్తున్న బ్రహ్మవిహారిదాస్ స్వామిజీ.. శాంతి, సామరస్యం, సహనం, సహజీవనం విలువలను పెంచేలా ఆలయ నిర్మాణాన్ని అద్వితీయ నిర్మించారని తిపారు. భారతీయ సాంస్కృతిక వ్యవస్థలను తెలియజేసేలా ఆలయం లోపల నిర్మించిన వాస్తు శిల్పాలను చూసి రాయబారులు ఆశ్చర్యపోయారు.
BAPS హిందూ దేవాలయం పునాది రాయిని 2018లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వేశారు. ఇది ఫిబ్రవరి 2024 నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఈ ఆలయానికి 17 ఎకరాల భూమిని యూఏఈ ప్రభుత్వం బహుమతిగా ఇచ్చింది. యూఏఈని తమ రెండవ నివాసంగా మార్చుకున్న 3.5 మిలియన్ల భారతీయులతో పాటు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడు, భారతదేశం-యుఎఇ మధ్య స్నేహానికి చిహ్నంగా నిలిచిపోయే ఆలయ నిర్మాణం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజా వార్తలు
- మెట్రో అమ్మకం పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో మగ తెల్లపులి మృత్యువాత
- బయోమెట్రిక్ ఫింగర్ప్రింట్ గడువు పొడిగింపు
- కువైట్ నుండి బయలుదేరిన మెజెస్టి ది సుల్తాన్
- రియల్ ఎస్టేట్ ఏజెంట్లపై కొరడా..7 సంస్థల లైసెన్స్లు సస్పెండ్
- యూఏఈ ఫ్లైట్స్..కొత్త ప్రోటోకాల్ జారీ
- వారంలో 450,000 మంది ప్రజలు రఫా నుండి తరలిపోయారు.. UN
- యూఏఈలో దశల వారీగా జయవాన్ డెబిట్ కార్డ్ల జారీ
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్