జూన్‌ 22 నుంచి ఆషాడ బోనాలు ప్రారంభం

- May 26, 2023 , by Maagulf
జూన్‌ 22 నుంచి ఆషాడ బోనాలు ప్రారంభం

హైదరాబాద్‌: ఆషాడంలో నిర్వహించే బోనాల ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.15 కోట్లు కేటాయించిందని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వెల్లడించారు. జూన్‌ 22న గోల్కండలో బోనాలు ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ మేరకు బేగంపేటలోని హరిత ప్లాజాలో తెలంగాణ సీఎస్‌ శాంతి కుమారి, మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, మంత్రి మల్లారెడ్డి, డీజీపీ అంజనీ కుమార్‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డిలతో కలిసి బోనాల ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల్లో నిర్వహించే ఉత్సవాల తేదీలను ప్రకటించారు. జులై 9న సికింద్రాబాద్‌ మహంకాళి బోనాలు, 10న రంగం, 16న ఓల్డ్‌ సిటీ బోనాలు, 17న ఊరేగింపు, జూన్‌ 20న బల్కంపేట్‌ ఎల్లమ్మ కల్యాణం నిర్వహిస్తారని వెల్లడించారు.

--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి, హైదరాబాద్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com