‘మన్ కీ బాత్’ ప్రసంగంలో ఎన్టీఆర్ గురించి ప్రస్తావించిన ప్రధాని మోదీ
- May 28, 2023
న్యూ ఢిల్లీ: నందమూరి తారకరామారావు శత జయంతి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశ, విదేశాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. టీడీపీ శ్రేణులు, తెలుగు రాష్ట్రాల్లోని ఎన్టీఆర్ అభిమానులు ఆదివారం ఆయన చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో పేద, బడుగు వర్గాలకు అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ నామస్మరణ మారుమోగిపోతుంది.
ప్రధాని నరేంద్ర మోదీ ‘101వ మన్ కీ బాత్’ ఎపిసోడ్లో నందమూరి తారక రామారావు గురించి ప్రస్తావించారు. శత జయంతి సందర్భంగా ఎన్టీఆర్కు శ్రద్ధాంజలి ఘటించారు. కోట్లాది ప్రజల మనసుల్లో స్థానం సంపాదించిన వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. చిత్రరంగంతో పాటు రాజకీయ రంగంలో తన ప్రతిభతో ఆ మహనీయుడు చెరగని ముద్ర వేశారని ప్రధాని కొనియాడారు. 300పైగా చిత్రాల్లో నటించి అలరించిన ఎన్టీఆర్.. రాముడు, కృష్ణుడు పాత్రల్లో ఆయన నటన ఇప్పటికీ స్మరిస్తారని మోదీ అన్నారు. బహుముఖ ప్రజ్ఞతో ఎన్టీఆర్ సినీరంగంలో ఖ్యాతిగాంచారని, కోట్ల మంది హృదయాల్లో నిలిచిపోయారని ప్రధాని మోదీ అన్నారు.
తాజా వార్తలు
- ప్రాంతీయ పరిణామాలపై బహ్రెయిన్, జోర్డాన్ చర్చలు..!!
- ల్యాండ్ పోర్టుల ద్వారా నిరాటకంగా చేపల దిగుమతులు..!!
- వైమానిక దాడిలో ఇరాన్ భద్రతా చీఫ్ మృతి
- పర్యాటకులకు ఇష్టమైన ఈద్ విహార కేంద్రంగా ఒమన్..!!
- ప్రాంతీయ పరిణామాల పై యూఏఈ అధ్యక్షుడు, భారత ప్రధాని చర్చలు..!!
- ఐపీఎల్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్లు వీరే!
- షిర్డీని తాకని 'గ్యాస్ సెగలు'.. సోలార్ మాహాత్మ్యం
- సచివాలయ ఉద్యోగులకు అలర్ట్: కొత్త అటెండెన్స్ రూల్స్ ఇవే
- ఐపీఎల్ జట్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026 SRH సీజన్ స్క్వాడ్









