ఎమర్జెన్సీ సీట్ల విక్రయాన్ని నిలిపివేసిన ఏషియానా ఎయిర్లైన్స్
- May 28, 2023
యూఏఈ: ఒక ప్రయాణీకుడు గాలిలో ఎమర్జెన్సీ ఎగ్జిట్ను తెరిచిన ప్రమాదం కారణంగా దక్షిణ కొరియాకు చెందిన ఏషియానా ఎయిర్లైన్స్ కొన్ని ఎమర్జెన్సీ సీట్ల విక్రయాన్ని నిలిపివేసినట్లు క్యారియర్ ఆదివారం తెలిపింది. సియోల్కు ఆగ్నేయంగా 240 కిలోమీటర్లు (149 మైళ్లు) దూరంలో ఉన్న డేగు అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద రన్వే వద్దకు చేరుకున్నప్పుడు దాదాపు 200 మంది ప్రయాణికులతో వెళ్తున్న A321-200 విమానంలో ఈ సంఘటన జరిగింది. విమానం సురక్షితంగా ల్యాండ్ కాగా.. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. అయితే, విమానయాన భద్రతా చట్టాలను ఉల్లంఘించినందుకు ఆ వ్యక్తిని డేగులో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నేరం రుజువైతే అతనికి 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత







