ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..
- May 29, 2023అహ్మదాబాద్: టీం ఇండియా దిగ్గజ ఆటగాడు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ఐపీఎల్(IPL)లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో 250 మ్యాచులు ఆడిన ఏకైక ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఆడడం ద్వారా ధోని ఈ ఘనతను అందుకున్నాడు. ఇప్పటి వరకు ఏ ఆటగాడు కూడా ఐపీఎల్లో ఇన్ని మ్యాచ్లు ఆడలేదు. ధోని ఐపీఎల్లో 39.09 సగటుతో 135.96 స్ట్రైక్ రేట్తో 5,082 పరుగులు చేశాడు. ఇందులో 24 అర్ధశతకాలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 84*. 239 సిక్సర్లు, 329 ఫోర్లు బాదాడు. కీపర్గా 141 ఔట్లలో భాగస్వామ్యం అయ్యాడు.
ఐపీఎల్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో ధోని తరువాత ముంబైఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నాడు. ఇంకా ఈ జాబితాలో ఎవరెవరు ఉన్నారంటే?
మహేంద్ర సింగ్ ధోని – 250
రోహిత్ శర్మ – 243
దినేశ్ కార్తిక్ – 242
విరాట్ కోహ్లి – 237
రవీంద్ర జడేజా- 225
శిఖర్ ధావన్ – 217
సురేశ్ రైనా – 205
రాబిన్ ఉతప్ప – 205
అంబటి రాయుడు -203
అశ్విన్- 197
తాజా వార్తలు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..
- ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- ప్రధాని మోడీ ప్రసంగం పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ
- కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం, 8 కార్లు ఢీ..
- భారతీయుల కోసం కొత్త ‘భా’ షూ సైజింగ్ సిస్టమ్..
- యూఏఈలో పెరగనున్న వాహన, ప్రాపర్టీ బీమా రేట్లు..!
- అక్రమ ప్రాక్టీస్..ప్రవాస మహిళా హెల్త్ ప్రాక్టీషనర్ అరెస్ట్
- వాతావరణ ప్రమాదాలపై కీలక కాన్ఫరెన్స్
- 'మాకు ఇప్పుడు ఇల్లు లేదు'.. దుబాయ్ టవర్ నివాసితులు ఆవేదన