ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..
- May 29, 2023
అహ్మదాబాద్: టీం ఇండియా దిగ్గజ ఆటగాడు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ఐపీఎల్(IPL)లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో 250 మ్యాచులు ఆడిన ఏకైక ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఆడడం ద్వారా ధోని ఈ ఘనతను అందుకున్నాడు. ఇప్పటి వరకు ఏ ఆటగాడు కూడా ఐపీఎల్లో ఇన్ని మ్యాచ్లు ఆడలేదు. ధోని ఐపీఎల్లో 39.09 సగటుతో 135.96 స్ట్రైక్ రేట్తో 5,082 పరుగులు చేశాడు. ఇందులో 24 అర్ధశతకాలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 84*. 239 సిక్సర్లు, 329 ఫోర్లు బాదాడు. కీపర్గా 141 ఔట్లలో భాగస్వామ్యం అయ్యాడు.
ఐపీఎల్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో ధోని తరువాత ముంబైఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నాడు. ఇంకా ఈ జాబితాలో ఎవరెవరు ఉన్నారంటే?
మహేంద్ర సింగ్ ధోని – 250
రోహిత్ శర్మ – 243
దినేశ్ కార్తిక్ – 242
విరాట్ కోహ్లి – 237
రవీంద్ర జడేజా- 225
శిఖర్ ధావన్ – 217
సురేశ్ రైనా – 205
రాబిన్ ఉతప్ప – 205
అంబటి రాయుడు -203
అశ్విన్- 197
తాజా వార్తలు
- యూఏఈలో చివరి లాంగ్ వీకెండ్: Dh725 నుండి ట్రావెల్ డీల్స్
- యూఏఈ ఐఫోన్ 15: ఆపిల్ స్టోర్ కు పోటెత్తిన కొనుగోలుదారులు
- గ్లోబల్ టాలెంట్ ర్యాంకింగ్స్.. బహ్రెయిన్ కు టాప్ ర్యాంకులు
- 38 క్రిమినల్ కేసులలో నిందితుడైన భారతీయ ప్రవాసి అరెస్ట్
- కల్తీ ఉత్పత్తుల తయారీ..నివాసితుడికి 2 సంవత్సరాల జైలు, SR20000 జరిమానా
- హైదరాబాద్ విమానాశ్రయాన్ని సందర్శించిన నేషనల్ కమిషన్ వైస్ చైర్మన్
- ఒమన్, స్లోవేకియా మధ్య వీసా మినహాయింపు ఒప్పందం
- భారతీయ వైద్యులకు గుడ్ న్యూస్..
- ఓటరుగా నమోదుకు ఆధార్ నంబర్ తప్పనిసరి కాదు
- చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు