మనామా సౌక్ని ఆదుకోవాలి
- May 12, 2016
మనామా సౌక్ ప్రభుత్వ సబ్సిడీ కోసం ఎదురుచూస్తోందనీ, ఉనికి కోసం పోరాడుతున్న మనామా సౌక్ని ప్రభుత్వం సబ్సిడీతో ఆదుకోవాలని మనామా ట్రెడిషనల్ మార్కెట్ డిప్యూటీ ఛైర్మన్ మహమూద్ అల్ నమిలిటి విజ్ఞప్తి చేశారు. సబ్సిడీల ఎత్తివేతతో మనామా సౌక్ చాలా ఇబ్బందులను ఎదుర్కొంటోందనీ, ఆర్థికంగా ఈ ఇబ్బందికర పరిస్థితుల కారణంగా చారిత్రక ప్రాముఖ్యం కలిగిన మనామా సౌక్ ఉనికికే ప్రమాదం ఏర్పడుతోందని ఆయన అన్నారు. ఎలక్ట్రిసిటీ, వాటర్పై సబ్సిడీ ఎత్తివేత మనామా సౌక్పై తీవ్ర ప్రభావం చూపిందని మహమూద్ చెప్పారు. యూఏఈ ఖతార్లలో ప్రభుత్వాలు 'సౌక్'లను ఆదుకుంటున్నాయని తద్వారా టూరిజం కేంద్రాలుగా అవి ఖ్యాతి గడిస్తున్నాయని చెప్పారు. బహ్రెయినీ సౌక్లు కూడా ఆ స్థాయి కలిగి ఉన్నా ప్రభుత్వం ఆదుకోని పక్షంలో పరిస్థితి దారుణంగా ఉంటుందని మొహమూద్ అన్నారు. మనామా సౌక్లో పెట్టుబడులు పెడితే రెండింతలు అవుతాయనీ, తమ్కీన్ వంటి సంస్థలు పెట్టుబడులు పెట్టాల్సి ఉందని చెప్పారాయన.
తాజా వార్తలు
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!







