సైబర్ ఫ్రాడ్ గురించి హెచ్చరించిన అబుధాబి పోలీసులు
- June 02, 2023
యూఏఈ: మోసపూరిత కాల్లు, మోసపూరిత వెబ్సైట్లు, వాటి లింక్ల పట్ల జాగ్రత్తగా వ్యవహారించాలని అబుధాబి పోలీసులు ప్రజలను హెచ్చరించారు. సైబర్ నేరగాళ్లు మెసేజ్ లు, కాల్స్, నకిలీ వెబ్సైట్ లింక్ల ద్వారా మోసపూరిత ప్రకటనలు, సేవలు పేరుతో ప్రజలను ప్రలోభాలకు గురిచేస్తారని, అనంతరం బ్యాంకు అకౌంట్ల వివరాలను తస్కరిస్తారని అబుధాబి పోలీసులు సూచించారు. బ్యాంక్ ఖాతా లేదా బ్యాంక్ కార్డ్ సమాచారం, ఆన్లైన్ బ్యాంకింగ్ పాస్వర్డ్లు, ATM పిన్లు, కార్డ్ వెరిఫికేషన్ వాల్యూ (CVV) నంబర్ లేదా పాస్వర్డ్లతో సహా తమ రహస్య సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని అబుధాబి పోలీసులు ప్రజలను హెచ్చరించారు. బ్యాంక్ ఖతాల వివరాలను బ్యాంక్ ఉద్యోగులు అడగరని, వివరాలను అప్డేడ్ చేసుకోవాలని సూచించారని పోలీసులు తమ ప్రకటనలో స్పష్టం చేశారు. ఇలాంటి మోసాలకు గురైన బాధితులు సమీపంలోని పోలీస్ స్టేషన్కు వెళ్లి రిపోర్ట్ చేయాలని, అమన్ సెక్యూరిటీ సర్వీస్ నంబర్ 8002626ను సంప్రదించాలని పోలీసులు సూచించారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







