137 సంస్థలపై 65.9 మిలియన్ దిర్హామ్ల జరిమానా
- June 02, 2023
యూఏఈ: 2023 మొదటి త్రైమాసికంలో మనీ లాండరింగ్, ఉగ్రవాదానికి ఫైనాన్సింగ్ (AML/CFT) చట్టం నిబంధనలు పాటించని సంస్థలపై యూఏఈ ఆర్థిక మంత్రిత్వ శాఖ భారీ జరిమానాలు విధించింది. నాన్-ఫైనాన్షియల్ బిజినెస్ లేదా ప్రొఫెషన్స్ (DNFBP) విభాగంలో పనిచేస్తున్న 137 కంపెనీలపై ఆర్థిక మంత్రిత్వ శాఖ Dh65.9 మిలియన్ల విలువైన జరిమానాలను విధించింది. మనీలాండరింగ్ నిరోధకం, ఉగ్రవాదం, చట్టవిరుద్ధ సంస్థలకు ఆర్థిక సహాయం చేయడం, దాని కార్యనిర్వాహక నిబంధనలు, సంబంధిత చట్టాలను ఎదుర్కోవడంపై 2018 ఫెడరల్ డిక్రీ-లా నెం. 20 ద్వారా నిర్దేశించబడిన నిబంధనలను ఆయా సంస్థలు ఉల్లంఘించాయని మినిస్ట్రీ ఆఫ్ కంట్రోల్ అండ్ ఫాలో-అప్ సెక్టార్ అసిస్టెంట్ అండర్ సెక్రటరీ అబ్దుల్లా సుల్తాన్ అల్ ఫ్యాన్ అల్ షమ్సీ తెలిపారు. మొత్తం 137 సంస్థలలో 831 ఉల్లంఘనలు గుర్తించినట్లు ఆయన వెల్లడించారు.
తాజా వార్తలు
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!







