వేసవిలో హైపర్థెర్మియా పట్ల అప్రమత్తంగా ఉండండి: నిపుణులు
- June 03, 2023
బహ్రెయిన్: వేసవిలో అధిక ఉష్ణోగ్రతలకు గురికావడం, ప్రాణాంతకమైన హైపర్థెర్మియా పట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరం అంతర్గత ఉష్ణోగ్రత దాని సాధారణ పరిధి కంటే పెరిగినప్పుడు హైపర్థెర్మియా పరిస్థితి ఏర్పడుతుందని, ఆ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే చాలా ప్రమాదకరమని, ప్రాణాపాయం కూడా సంభవిచ్చే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రత్యేకించి జూన్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్కు పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా బహ్రెయిన్లో తేమ ఎక్కువగా ఉంటుంది. ఇది గ్రహించిన ఉష్ణోగ్రతను సుమారు 4-5 డిగ్రీల వరకు పెంచే ప్రభావాన్ని కలిగి ఉంటుంది. దీని వలన వేడి మరింత తీవ్రంగా ఉంటుంది. అటువంటి తీవ్రమైన వేడిలో అలసట , హీట్స్ట్రోక్తో సహా వేడి-సంబంధిత అనారోగ్యాల ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది. దీని కారణంగా హైపర్థెర్మియా, హీట్ స్ట్రోక్ గణనీయమైన ప్రమాదాన్ని కలిగిస్తుందని, శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే యంత్రాంగాన్ని శరీరం కలిగి ఉన్నందున, బయట పనిచేసే వారికి హైపర్థెర్మియా ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుందని బహ్రెయిన్ స్పెషలిస్ట్ హాస్పిటల్లోని ఇంటర్నల్ మెడిసిన్ కన్సల్టెంట్ డాక్టర్ ఆసిఫ్ సర్దార్ వెల్లడించారు.
హైపర్థెర్మియా సంకేతాలను గుర్తించడంలో అప్రమత్తంగా ఉండాలని, వికారం, వాంతులు, తీవ్రమైన తలనొప్పి, అతిసారం, కండరాల తిమ్మిరి, నోరు పొడిబారడం వంటి లక్షణాలు ఉంటాయన్నారు. ఈ సూచికల గురించి ముందే తెలుసుకోవడం ద్వారా వ్యక్తులు హైపర్థెర్మియా పురోగతిని నివారించడానికి సకాలంలో చర్య తీసుకోవచ్చని, అవసరమైతే తగిన వైద్య సహాయం పొందవచ్చని డాక్టర్ సర్దార్ చెప్పారు. ఈ లక్షణాలు ముదిరితే చెమట పట్టడం ఆగిపోతుందని, చివరికి కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉందన్నారు. వృద్ధులలో.. ఎండలో ఎక్కువ సమయం గడిపేవారిలో ఈ సంకేతాల పట్ల అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం అని డాక్టర్ చెప్పారు. ఎందుకంటే వారిలో హైపర్థెర్మియా ప్రభావాలకు గురయ్యే అవకాశం అధికంగా ఉంటుందన్నారు. హీట్ స్ట్రోక్ను నివారించడానికి పుష్కలంగా నీరు త్రాగేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







