భారత్లో రైలు ప్రమాదంపై కువైట్ సంతాపం
- June 04, 2023
కువైట్: ఒడిశాలో శుక్రవారం జరిగిన పెద్ద రైలు ప్రమాదంలో వందలాది మంది మరణించిన ఘటనపై కువైట్ విదేశాంగ మంత్రిత్వ శాఖ శనివారం భారతదేశానికి తన సానుభూతిని తెలిపింది. ఈ బాధాకరమైన ఘటనపై మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీకి, భారత ప్రభుత్వానికి.. భారత ప్రజలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
మరోవైపు ఒడిశాలోని బాలాసోర్లో మూడు రైళ్ల ప్రమాదంలో మృతుల సంఖ్య 288కి చేరుకుందని భారతీయ రైల్వే శనివారం తెలిపింది. ఈ ప్రమాదంపై విచారణకు ఆదేశించామని, దోషులుగా తేలిన వారెవరినీ విడిచిపెట్టబోమని భారత ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







