భారత్లో రైలు ప్రమాదంపై కువైట్ సంతాపం
- June 04, 2023కువైట్: ఒడిశాలో శుక్రవారం జరిగిన పెద్ద రైలు ప్రమాదంలో వందలాది మంది మరణించిన ఘటనపై కువైట్ విదేశాంగ మంత్రిత్వ శాఖ శనివారం భారతదేశానికి తన సానుభూతిని తెలిపింది. ఈ బాధాకరమైన ఘటనపై మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీకి, భారత ప్రభుత్వానికి.. భారత ప్రజలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
మరోవైపు ఒడిశాలోని బాలాసోర్లో మూడు రైళ్ల ప్రమాదంలో మృతుల సంఖ్య 288కి చేరుకుందని భారతీయ రైల్వే శనివారం తెలిపింది. ఈ ప్రమాదంపై విచారణకు ఆదేశించామని, దోషులుగా తేలిన వారెవరినీ విడిచిపెట్టబోమని భారత ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- నేటి నుంచి జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభం
- ఆధార్ ఫ్రీ అప్డేట్ గడువు పొడిగింపు..
- వేసవిలో చికెన్పాక్స్ ముప్పు.. నివాసితులను వైద్యులు హెచ్చరిక
- పారిపోతున్న పనిమనిషి కేసులు పెరుగుతున్నాయా?
- రియాద్లో అర్హత లేని ఆరోగ్య నిపుణులు అరెస్ట్
- సభన్లో కార్మికుల కోసం రెసిడెన్షియల్ సిటీ నిర్మాణం
- ఖైదీల విడుదలకు అహద్ ఫౌండేషన్ సాయం
- అరబ్ సమ్మిట్.. సిరియా, ఇరాక్లను ఆహ్వానించిన కింగ్ హమద్
- ఎయిర్ ఇండియా పై రూ.80 లక్షల ఫైన్
- రూ.56,999కే Apple iPhone 14