భారత్‌లో రైలు ప్రమాదంపై కువైట్ సంతాపం

- June 04, 2023 , by Maagulf
భారత్‌లో రైలు ప్రమాదంపై కువైట్ సంతాపం

కువైట్: ఒడిశాలో శుక్రవారం జరిగిన పెద్ద రైలు ప్రమాదంలో వందలాది మంది మరణించిన ఘటనపై కువైట్ విదేశాంగ మంత్రిత్వ శాఖ శనివారం భారతదేశానికి తన సానుభూతిని తెలిపింది.  ఈ బాధాకరమైన ఘటనపై మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీకి, భారత ప్రభుత్వానికి.. భారత ప్రజలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

మరోవైపు ఒడిశాలోని బాలాసోర్‌లో మూడు రైళ్ల ప్రమాదంలో మృతుల సంఖ్య 288కి చేరుకుందని భారతీయ రైల్వే శనివారం తెలిపింది. ఈ ప్రమాదంపై విచారణకు ఆదేశించామని, దోషులుగా తేలిన వారెవరినీ విడిచిపెట్టబోమని భారత ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com