భారత్లో రైలు ప్రమాదంపై కువైట్ సంతాపం
- June 04, 2023
కువైట్: ఒడిశాలో శుక్రవారం జరిగిన పెద్ద రైలు ప్రమాదంలో వందలాది మంది మరణించిన ఘటనపై కువైట్ విదేశాంగ మంత్రిత్వ శాఖ శనివారం భారతదేశానికి తన సానుభూతిని తెలిపింది. ఈ బాధాకరమైన ఘటనపై మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీకి, భారత ప్రభుత్వానికి.. భారత ప్రజలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
మరోవైపు ఒడిశాలోని బాలాసోర్లో మూడు రైళ్ల ప్రమాదంలో మృతుల సంఖ్య 288కి చేరుకుందని భారతీయ రైల్వే శనివారం తెలిపింది. ఈ ప్రమాదంపై విచారణకు ఆదేశించామని, దోషులుగా తేలిన వారెవరినీ విడిచిపెట్టబోమని భారత ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









