కొత్త బయోమెట్రిక్ కేంద్రాలు: ప్రవాసులకు రెండు, పౌరులకు మూడు
- June 04, 2023కువైట్: డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ క్రిమినల్ ఎవిడెన్స్ జూన్ 1న మూడు కొత్త బయోమెట్రిక్ కేంద్రాలను ప్రారంభించింది. దీంతో కువైటీలు, గల్ఫ్ దేశస్థుల కోసం కేటాయించిన మొత్తం బయోమెట్రిక్ కేంద్రాల సంఖ్య ఐదుకు పెరిగింది. ఈ కేంద్రాలు ఉదయం 8:00 నుండి రాత్రి 8:00 వరకు పనిచేస్తాయని అధికారులు పేర్కొన్నారు.
కువైటీలు, GCC పౌరుల కోసం బయోమెట్రిక్ కేంద్రాలను హవలీ సెక్యూరిటీ డైరెక్టరేట్, ఫర్వానియా సెక్యూరిటీ డైరెక్టరేట్, అహ్మదీ సెక్యూరిటీ డైరెక్టరేట్, ముబారక్ అల్కబీర్ సెక్యూరిటీ డైరెక్టరేట్, జహ్రా సెక్యూరిటీ డైరెక్టరేట్ లలో ఏర్పాటు చేశారు. నివాసితుల అలీ సబా అల్-సలేం, జహ్రా ప్రాంతాల్లో బయోమెట్రిక్ కేంద్రాలను నెలకొల్పారు.
పౌరులు, నివాసితులు తమ బయోమెట్రిక్ నమోదు కోసం ఈ కేంద్రాలలో సహేల్ యాప్ (మాతా ప్లాట్ఫారమ్) ద్వారా అపాయింట్మెంట్లను బుక్ చేసుకోవచ్చని అంతర్గత మంత్రిత్వ శాఖలోని సెక్యూరిటీ రిలేషన్స్, మీడియా డైరెక్టరేట్ జనరల్ వివరించింది. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాల పౌరులు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెబ్సైట్ ద్వారా అపాయింట్మెంట్లను బుక్ చేసుకోవచ్చన్నారు.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ