కొత్త బయోమెట్రిక్ కేంద్రాలు: ప్రవాసులకు రెండు, పౌరులకు మూడు
- June 04, 2023
కువైట్: డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ క్రిమినల్ ఎవిడెన్స్ జూన్ 1న మూడు కొత్త బయోమెట్రిక్ కేంద్రాలను ప్రారంభించింది. దీంతో కువైటీలు, గల్ఫ్ దేశస్థుల కోసం కేటాయించిన మొత్తం బయోమెట్రిక్ కేంద్రాల సంఖ్య ఐదుకు పెరిగింది. ఈ కేంద్రాలు ఉదయం 8:00 నుండి రాత్రి 8:00 వరకు పనిచేస్తాయని అధికారులు పేర్కొన్నారు.
కువైటీలు, GCC పౌరుల కోసం బయోమెట్రిక్ కేంద్రాలను హవలీ సెక్యూరిటీ డైరెక్టరేట్, ఫర్వానియా సెక్యూరిటీ డైరెక్టరేట్, అహ్మదీ సెక్యూరిటీ డైరెక్టరేట్, ముబారక్ అల్కబీర్ సెక్యూరిటీ డైరెక్టరేట్, జహ్రా సెక్యూరిటీ డైరెక్టరేట్ లలో ఏర్పాటు చేశారు. నివాసితుల అలీ సబా అల్-సలేం, జహ్రా ప్రాంతాల్లో బయోమెట్రిక్ కేంద్రాలను నెలకొల్పారు.
పౌరులు, నివాసితులు తమ బయోమెట్రిక్ నమోదు కోసం ఈ కేంద్రాలలో సహేల్ యాప్ (మాతా ప్లాట్ఫారమ్) ద్వారా అపాయింట్మెంట్లను బుక్ చేసుకోవచ్చని అంతర్గత మంత్రిత్వ శాఖలోని సెక్యూరిటీ రిలేషన్స్, మీడియా డైరెక్టరేట్ జనరల్ వివరించింది. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాల పౌరులు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెబ్సైట్ ద్వారా అపాయింట్మెంట్లను బుక్ చేసుకోవచ్చన్నారు.
తాజా వార్తలు
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు







