కొత్త బయోమెట్రిక్ కేంద్రాలు: ప్రవాసులకు రెండు, పౌరులకు మూడు
- June 04, 2023
కువైట్: డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ క్రిమినల్ ఎవిడెన్స్ జూన్ 1న మూడు కొత్త బయోమెట్రిక్ కేంద్రాలను ప్రారంభించింది. దీంతో కువైటీలు, గల్ఫ్ దేశస్థుల కోసం కేటాయించిన మొత్తం బయోమెట్రిక్ కేంద్రాల సంఖ్య ఐదుకు పెరిగింది. ఈ కేంద్రాలు ఉదయం 8:00 నుండి రాత్రి 8:00 వరకు పనిచేస్తాయని అధికారులు పేర్కొన్నారు.
కువైటీలు, GCC పౌరుల కోసం బయోమెట్రిక్ కేంద్రాలను హవలీ సెక్యూరిటీ డైరెక్టరేట్, ఫర్వానియా సెక్యూరిటీ డైరెక్టరేట్, అహ్మదీ సెక్యూరిటీ డైరెక్టరేట్, ముబారక్ అల్కబీర్ సెక్యూరిటీ డైరెక్టరేట్, జహ్రా సెక్యూరిటీ డైరెక్టరేట్ లలో ఏర్పాటు చేశారు. నివాసితుల అలీ సబా అల్-సలేం, జహ్రా ప్రాంతాల్లో బయోమెట్రిక్ కేంద్రాలను నెలకొల్పారు.
పౌరులు, నివాసితులు తమ బయోమెట్రిక్ నమోదు కోసం ఈ కేంద్రాలలో సహేల్ యాప్ (మాతా ప్లాట్ఫారమ్) ద్వారా అపాయింట్మెంట్లను బుక్ చేసుకోవచ్చని అంతర్గత మంత్రిత్వ శాఖలోని సెక్యూరిటీ రిలేషన్స్, మీడియా డైరెక్టరేట్ జనరల్ వివరించింది. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాల పౌరులు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెబ్సైట్ ద్వారా అపాయింట్మెంట్లను బుక్ చేసుకోవచ్చన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో చివరి లాంగ్ వీకెండ్: Dh725 నుండి ట్రావెల్ డీల్స్
- యూఏఈ ఐఫోన్ 15: ఆపిల్ స్టోర్ కు పోటెత్తిన కొనుగోలుదారులు
- గ్లోబల్ టాలెంట్ ర్యాంకింగ్స్.. బహ్రెయిన్ కు టాప్ ర్యాంకులు
- 38 క్రిమినల్ కేసులలో నిందితుడైన భారతీయ ప్రవాసి అరెస్ట్
- కల్తీ ఉత్పత్తుల తయారీ..నివాసితుడికి 2 సంవత్సరాల జైలు, SR20000 జరిమానా
- హైదరాబాద్ విమానాశ్రయాన్ని సందర్శించిన నేషనల్ కమిషన్ వైస్ చైర్మన్
- ఒమన్, స్లోవేకియా మధ్య వీసా మినహాయింపు ఒప్పందం
- భారతీయ వైద్యులకు గుడ్ న్యూస్..
- ఓటరుగా నమోదుకు ఆధార్ నంబర్ తప్పనిసరి కాదు
- చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు