తొమ్మిదేళ్ల పాలనలో కెసిఆర్ రూ. 5 లక్షల కోట్ల అప్పు చేశారు: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
- June 04, 2023
హైదరాబాద్: తెలంగాణ సిఎం కెసిఆర్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. 9 ఏళ్ల పాలనలో కెసిఆర్ 5 లక్షల కోట్ల అప్పు చేశారని ఆరోపించారు. ఈ తొమ్మిదేళ్లలో రూ.17 లక్షల కోట్లు బడ్జెట్ ద్వారా వచ్చాయని, అప్పుతో కలిపి మొత్తం రూ.22 లక్షల కోట్లు ఖర్చు చేసినా తెలంగాణ ప్రజల సగటు జీవితంలో ఎలాంటి మార్పులు రాలేదని విమర్శించారు. న్యూజెర్సీలో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలంటూ ప్రవాసులకు పిలుపునిచ్చారు.
అమెరికాలో ఉన్న తెలంగాణ వాళ్లు రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. కాంగ్రెస్ విజయంతోనే ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయన్న రేవంత్ కెసిఆర్ దోపిడీని ఇంకా ఎంతకాలం భరిద్దాం? అని ప్రశ్నించారు. అన్ని వర్గాల పోరాటం, త్యాగంతో రాష్ట్రం ఏర్పాటైతే, ఒక్క కేసీఆర్ కుటుంబమే పదేళ్లుగా పాలిస్తూ అడ్డగోలుగా అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని రేవంత్ దుయ్యబట్టారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ను కూడా తెలంగాణ ప్రజలు ఆదరించాలని కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే తెలంగాణ ప్రజలు ఆశలు, ఆశయాలు నెరవేరుతాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- ఒక నెల స్కూళ్లకు సెలవులు..పీక్ ట్రావెల్ సీజన్..!!
- కువైట్ లో ఎయిర్ లైన్ సహా 8 ట్రావెల్ ఆఫీసులకు ఫైన్స్..!!
- మీడియాలో అభ్యంతరకర ప్రకటనలు..వ్యక్తి అరెస్టు..!!
- ఒమన్ లో సాంస్కృతిక వీసా..ఎవరికిస్తారంటే?
- మీ బ్యాంక్ వెబ్సైట్ అడ్రస్ మారింది.. ఇకపై .com, .co.in ఉండవు
- విశాఖపట్నం కంటే ముందే ఏపి కి భారీ పెట్టుబడులు
- AI చాట్బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం







