నేషనల్ ట్రాకింగ్ సిస్టం: ఉల్లంఘించిన వారికి Dh10,000 జరిమానా..!
- June 05, 2023
యూఏఈ: ట్రక్కులు, షిప్మెంట్లను ఎలక్ట్రానిక్గా ట్రాక్ చేయడం కోసం జాతీయ ట్రాకింగ్ వ్యవస్థను ఉల్లంఘించిన వారికి Dhs500 నుండి Dhs10,000 వరకు జరిమానా విధించబడుతుందని ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్షిప్, కస్టమ్స్ అండ్ పోర్ట్స్ సెక్యూరిటీ (ICP) వెల్లడించింది. 2023 అక్టోబరు 30తో ముగిసే ఆమోదించబడిన రిజిస్ట్రేషన్ వ్యవధిలో సిస్టమ్లో నమోదు చేసుకోవాలని వస్తువులను రవాణా చేసే మార్గాల యజమానులకు.. ట్రక్కుల యజమానులకు ICP పిలుపునిచ్చింది. అక్టోబర్ 31 నుండి జరిమానాలను వర్తింపజేయడం ప్రారంభించనున్నట్లు ఐసీపీ తెలిపింది.
రిజిస్ట్రేషన్ గడువు తేదీ నుండి 60 రోజులలోపు సిస్టమ్లో నమోదు చేసుకోని వారికి గరిష్టంగా Dhs2,500, రిజిస్ట్రేషన్ అప్లికేషన్లో తప్పు డేటాను సమర్పించిన వారిపై గరిష్టంగా Dhs 5,000, ట్రక్ రూట్ను మార్చిన, ట్రక్ డ్రైవర్ను మార్చిన లేదా ICPకి తెలియజేయకుండా ట్రక్కు ఆకారాన్ని మార్చినా గరిష్టంగా2,000 Dhs, గమ్యస్థానానికి చేరుకోవడానికి ముందు షిప్మెంట్ను లోడ్ చేసిన లేదా అన్లోడ్ చేసిన వారికి గరిష్టంగా 10,000 Dhs జరిమానాలు విధించనున్నట్లు ఐసీపీ తెలిపింది. ప్లాట్ఫారమ్ వెబ్సైట్ (https://icp.massarsolutions.ae) ద్వారా లైసెన్స్ హోల్డర్ లేదా అతని చట్టపరమైన ప్రతినిధి ద్వారా రిజిస్ట్రేషన్ అప్లికేషన్ను సమర్పించడం ద్వారా సిస్టమ్లో నమోదు చేసుకోవడం సాధ్యమవుతుందన్నారు.
తాజా వార్తలు
- ఇన్ఫోసిస్ కొత్త ప్రోత్సాహకాలు
- తెరుచుకున్న శబరిమల ఆలయం..
- ఫిబ్రవరి నెల దర్శన కోటా విడుదల వివరాలు
- చంద్రయాన్-4కు సిద్ధమైన ఇస్రో కీలక అప్డేట్..
- సహెల్ యాప్లో కొత్త సేవ ప్రారంభం
- మరోమారు ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్..!
- IPL 2026: ఫ్రాంచైజీల రిటెన్షన్ లిస్ట్ ఇదే
- 'దమ్ముంటే పట్టుకోండి' అన్నాడు..చాలా సింపుల్ గా పట్టుకున్నారు: CV ఆనంద్
- NDA భారీ విజయంతో బీహార్లో కొత్త ప్రభుత్వం
- యూఏఈ లాటరీ: 7 మంది విజేతలు.. ఒక్కొక్కరికి Dh100,000..!!







