ఉత్సాహంతో పోలింగ్ కేంద్రాలకు పోటెత్తిన కువైటీలు

- June 06, 2023 , by Maagulf
ఉత్సాహంతో పోలింగ్ కేంద్రాలకు పోటెత్తిన కువైటీలు

కువైట్: 2023 జాతీయ అసెంబ్లీకి ఓటు వేయడానికి కువైట్ ఓటర్లు దేశవ్యాప్తంగా ఉన్న పోలింగ్ స్టేషన్‌లకు తరలి వచ్చారు.  ఓటర్లు ఉత్సాహంతో కూడిన వాతావరణంలో ఓటు వేసేందుకు పోలింగ్ స్టేషన్ల వద్ద బారులు తీరారు. కువైట్  పార్లమెంటులో 50 మంది ఎంపీలను ఎన్నుకునేందుకు కువైటీలు ఓటింగ్లో పాల్గొంటున్నారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8:00 గంటలకు ప్రారంభమై ఓటింగ్ ప్రక్రియ  రాత్రి 8:00 గంటల వరకు కొనసాగుతుంది. కువైట్ 1961లో స్వాతంత్రం  ప్రకటించిన తర్వాత 1963లో కువైట్ మొదటి పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com