Dh295కే విమాన ప్రయాణం..తగ్గింపు ఆఫర్లు ప్రకటించిన ఎతిహాద్
- June 10, 2023
యూఏఈ: వేసవి కాలంలో ప్రయాణికులను దృష్టిలో పెట్టుకొని ఎతిహాద్ ఎయిర్వేస్ తగ్గింపు ఆఫర్ ని ప్రకటించింది. ఈ ఆఫర్లు జూన్ 9 నుండి 15 వరకు తమ టిక్కెట్లను బుక్ చేసుకునే ప్రయాణికులందరూ జూలై 3, సెప్టెంబర్ 30 మధ్య ప్రయాణించడానికి తగ్గింపు ధరలను పొందవచ్చని ఎతిహాద్ ఎయిర్వేస్ చీఫ్ రెవిన్యూ ఆఫీసర్ అరిక్ దే తెలిపారు.
ఎకానమీ క్లాస్ ఛార్జీలు మస్కట్కి Dh295 నుండి..బిజినెస్ క్లాస్ ఛార్జీలు Dh995 నుండి ప్రారంభమవుతాయి. రుచికరమైన టర్కిష్ వంటకాలను ఆస్వాదించడానికి.. విలాసవంతమైన ప్యాలెస్లు, అందమైన వాస్తుశిల్పంతో ఒట్టోమన్ శకం గురించి తెలుసుకునేందుకు ప్రయాణీకులు ఇస్తాంబుల్ని ఎకానమీలో Dh895 నుండి సందర్శించవచ్చు. Dh2,795తో పారిస్కు వెళ్లవచ్చు. ఎకానమీ క్లాస్లో 2,495 దిర్హామ్లతో మాంచెస్టర్ని సందర్శించవచ్చు. మ్యూనిచ్కి ఎకానమీ క్లాస్లో 2,695 దిర్హామ్లు.. బిజినెస్ క్లాస్లో 13,995 దిర్హామ్లతో చేరుకోవచ్చు.
జ్యూరిచ్లోని పర్యాటక ప్రదేశాలను ఎకానమీలో Dh2,395, బిజినెస్ క్లాస్ లో Dh14,995 చెల్లించే ఎంచక్కా ఎంజాయ్ చేయవచ్చు. ఎకానమీ క్లాస్లో 2,995 దిర్హామ్లు, బిజినెస్ క్లాస్లో 14,995 ధరలతో పర్యాటకులు ఆమ్స్టర్డ్యామ్ని సందర్శించవచ్చు. బిజినెస్ క్లాస్లో ఎకానమీ క్లాస్ టిక్కెట్ ధరలు Dh19,995 చెల్లించి చికాగోలో పర్యటించవచ్చు. తగ్గింపు ధరలతో పాటు, ఎతిహాద్ ఎయిర్వేస్ నుండి అవార్డు గెలుచుకున్న లాయల్టీ ప్రోగ్రామ్ అయిన ఎతిహాద్ గెస్ట్ సభ్యులు http://Booking.comతో హోటల్లను బుక్ చేసేటప్పుడు 3 - 6 మైళ్ల మధ్య Avis కార్ రైడ్లను ఉచితంగా పొందవచ్చు.
తాజా వార్తలు
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు







