ఇస్తాంబుల్లో చారిత్రాత్మక మ్యాచుని వీక్షించిన యూఏఈ అధ్యక్షుడు
- June 11, 2023
యూఏఈ: ఇస్తాంబుల్లో జరిగిన ప్రీమియర్ లీగ్ ఛాంపియన్స్ ఫైనల్లో మిలాన్ను 1-0తో మాంచెస్టర్ సిటీ ఓడించి చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. 68వ నిమిషంలో రోడ్రీ చేసిన అద్భుతమైన గోల్తో మాంచెస్టర్ సిటీ చారిత్రాత్మక ఛాంపియన్స్ లీగ్ టైటిల్ను కైవసం చేసుకుంది. యూఏఈ ప్రెసిడెంట్ హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో సహా అనేక మంది ప్రముఖులు, ఉన్నత స్థాయి వ్యక్తులు ఇస్తాంబుల్లోని అటాటర్క్ ఒలింపిక్ స్టేడియంలో థ్రిల్లింగ్ మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించారు. షేక్ మొహమ్మద్తో పాటు యూఏఈ ఉపాధ్యక్షుడు, ఉప ప్రధాన మంత్రి, న్యాయశాఖ మంత్రి, మాంచెస్టర్ సిటీ యజమాని అయిన షేక్ మన్సూర్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఉన్నారు. షేక్ మన్సూర్ తర్వాత మాంచెస్టర్ సిటీ విజయంపై అభినందనలు తెలుపుతూ ట్విట్ చేశారు. ఆటగాళ్లతో సహా క్లబ్లోని ప్రతి ఒక్కరికి తన అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- సలాలాకు ఎతిహాద్ ఎయిర్వేస్ కొత్త విమాన సర్వీసులు ప్రారంభం
- APSFTVTDCకు కొత్త పాలకవర్గం నియామకం
- IPL 2026: కోహ్లీ తర్వాత గిల్.. టీ20ల్లో కొత్త రికార్డు!
- అమెరికా-క్యూబా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు..
- మే 28న బక్రీద్ సెలవు: ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్ సాయి ప్రసాద్
- ఈద్ అల్ అధా సందర్భంగా 836 మంది ఖైదీలకు షేక్ మొహమ్మద్ క్షమాభిక్ష
- తెలంగాణ ఎన్నారై అడ్వైజరీ కమిటీ ఏపీ పర్యటన విజయవంతం
- సరస్వతీ అంత్య పుష్కరాల్లో గవర్నర్ దంపతుల పుణ్యస్నానం
- ఆన్లైన్లో పోస్ట్ చేసే ముందు తెలుసుకోవాల్సిన యూఏఈ 10 కీలక మీడియా చట్టాలు
- ఏపీలో పర్యటిస్తున్న తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై కమిటీ









