ఇస్తాంబుల్లో చారిత్రాత్మక మ్యాచుని వీక్షించిన యూఏఈ అధ్యక్షుడు
- June 11, 2023
యూఏఈ: ఇస్తాంబుల్లో జరిగిన ప్రీమియర్ లీగ్ ఛాంపియన్స్ ఫైనల్లో మిలాన్ను 1-0తో మాంచెస్టర్ సిటీ ఓడించి చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. 68వ నిమిషంలో రోడ్రీ చేసిన అద్భుతమైన గోల్తో మాంచెస్టర్ సిటీ చారిత్రాత్మక ఛాంపియన్స్ లీగ్ టైటిల్ను కైవసం చేసుకుంది. యూఏఈ ప్రెసిడెంట్ హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో సహా అనేక మంది ప్రముఖులు, ఉన్నత స్థాయి వ్యక్తులు ఇస్తాంబుల్లోని అటాటర్క్ ఒలింపిక్ స్టేడియంలో థ్రిల్లింగ్ మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించారు. షేక్ మొహమ్మద్తో పాటు యూఏఈ ఉపాధ్యక్షుడు, ఉప ప్రధాన మంత్రి, న్యాయశాఖ మంత్రి, మాంచెస్టర్ సిటీ యజమాని అయిన షేక్ మన్సూర్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఉన్నారు. షేక్ మన్సూర్ తర్వాత మాంచెస్టర్ సిటీ విజయంపై అభినందనలు తెలుపుతూ ట్విట్ చేశారు. ఆటగాళ్లతో సహా క్లబ్లోని ప్రతి ఒక్కరికి తన అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







