బెంగుళూర్ లో దారుణం : తల్లిని చంపిన కూతురు
- June 13, 2023
బెంగుళూర్: చిన్న చిన్న సమస్యలకే మదనపడిపోయి క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడడం లేదా ఇతరుల ప్రాణాలు తీయడం చేస్తున్నారు. తాజాగా రోజు తనతో గొడవపడుతుందని కన్న తల్లినే చంపేసింది ఓ కూతురు. ఆ తర్వాత శవాన్ని సూట్కేసులో కుక్కి పోలీసులకు లొంగిపోయింది. ఈ ఘటన బెంగుళూర్ జరిగింది.
పశ్చిమ బెంగాల్కు చెందిన 39 ఏళ్ల మహిళ ఫిజియోథెరపిస్ట్. బెంగళూరులో తల్లితో కలిసి ఓ ఫ్లాట్లో నివసిస్తోంది. కాగా ప్రతి రోజు తనతో తల్లి గొడవపడుతుందని, ఇలా రోజు రోజుకు ఎక్కువ అవుతుందని , గత రాత్రి కూడా ఇలాగె గొడవ పడ్డామని , చివరకు కోపం తట్టుకోలేక తల్లిని చంపినట్లు నిందితురాలు పోలీసుల ముందు ఒప్పుకుంది. ఘటన జరిగిన సమయంలో నిందితురాలి భర్త ఇంట్లో లేడని , ఆమె అత్తగారు ఇంట్లోనే ఉన్నప్పటికీ నిందితురాలు తన గదిలో ఈ హత్యకు పాల్పడడంతో ఆమెకు తెలియరాలేదని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!







