బెంగుళూర్ లో దారుణం : తల్లిని చంపిన కూతురు
- June 13, 2023
బెంగుళూర్: చిన్న చిన్న సమస్యలకే మదనపడిపోయి క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడడం లేదా ఇతరుల ప్రాణాలు తీయడం చేస్తున్నారు. తాజాగా రోజు తనతో గొడవపడుతుందని కన్న తల్లినే చంపేసింది ఓ కూతురు. ఆ తర్వాత శవాన్ని సూట్కేసులో కుక్కి పోలీసులకు లొంగిపోయింది. ఈ ఘటన బెంగుళూర్ జరిగింది.
పశ్చిమ బెంగాల్కు చెందిన 39 ఏళ్ల మహిళ ఫిజియోథెరపిస్ట్. బెంగళూరులో తల్లితో కలిసి ఓ ఫ్లాట్లో నివసిస్తోంది. కాగా ప్రతి రోజు తనతో తల్లి గొడవపడుతుందని, ఇలా రోజు రోజుకు ఎక్కువ అవుతుందని , గత రాత్రి కూడా ఇలాగె గొడవ పడ్డామని , చివరకు కోపం తట్టుకోలేక తల్లిని చంపినట్లు నిందితురాలు పోలీసుల ముందు ఒప్పుకుంది. ఘటన జరిగిన సమయంలో నిందితురాలి భర్త ఇంట్లో లేడని , ఆమె అత్తగారు ఇంట్లోనే ఉన్నప్పటికీ నిందితురాలు తన గదిలో ఈ హత్యకు పాల్పడడంతో ఆమెకు తెలియరాలేదని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!







