మళ్లీ మణిపూర్లో చెలరేగిన హింస.. 9 మంది మృతి
- June 14, 2023
ఇంఫాల్: జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్లో మళ్లీ హింస చెలరేగింది. తాజా ఘటనలో మరో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరెంతో మంది గాయపడ్డారు. ఖమెన్లోక్ ప్రాంతంలో గత రాత్రి జరిగిన కాల్పుల్లో వీరంతా మరణించినట్టు ఆర్మీ వర్గాలు తెలిపాయి. వీరిలో ఓ మహిళ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. గాయపడిన వారిని రాజధాని ఇంఫాల్లోని ఆసుపత్రికి తరలించారు.
మరణించిన వారిలో కొందరి శరీరాలపై కోసిన గాయాలు ఉండగా, మరికొందరి శరీరంలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. కర్ఫ్యూ సడలింపు తర్వాత ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. నెల రోజులుగా జరుగుతున్న హింసాత్మక ఘటనలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం చర్యలు తీసుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో కేంద్రరాష్ట్రాల్లోని బీజేపీ ప్రభుత్వాలపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి.
తాజా వార్తలు
- హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యాధునిక కార్గో టెర్మినల్ 2 ప్రారంభం
- 2026 జూన్ 1 నుంచి యూఏఈ ప్రైవేట్ రంగానికి ఏకీకృత జీతాల గడువు అమలు
- ఫేక్ ఉద్యోగాల పేరిట మహిళలను ఆకర్షించి, లైంగిక దోపిడీ..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలు.. యూఏఈ, ఈజిప్టులతో సౌదీ చర్చలు..!!
- కువైట్ లో 'WAMD' సాంకేతిక వైఫల్యాలకు ఫైన్స్..!!
- సీబీఎస్ఈ తాజా నిబంధన నుండి యూఏఈ స్కూళ్లకు మినహాయింపు..!!
- లోకల్ తేనె విక్రయాలపై అవేర్ నెస్ వర్క్ షాప్..!!
- ఒమానీ రియాల్కు 250 మార్కును దాటిన రూపాయి..!!
- మోదీ, ఉల్ఫ్ ఉల్ఫ్ క్రిస్టర్సన్-స్వీడన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాల అంగీకారం
- హైదరాబాద్–ముంబై బుల్లెట్ ట్రైన్ రూట్ ఇదే..









