కిడ్నాప్ అయిన విశాఖ ఎంపీ కుమారుడు, భార్య
- June 15, 2023
విశాఖపట్నం: విశాఖలో కలకలం రేపిన వైసీపీ ఎంపీ ఎవివి సత్యనారాయణ భార్య, కుమారుడు, ఆడిటల్ జీవీ కిడ్నాప్ సుఖాంతమైంది. ఎంపీ, భార్య,కుమారుడు, ఆడిటర్ జీవి సురక్షితంగా విడిపించారు పోలీసులు. వారు ముగ్గురు క్షేమంగా ఉన్నారని ప్రకటించారు. గురువారం (జూన్ 14) ఉదయం ఎంపీ కుమారుడు, భార్య, ఆడిటర్ జీవిలు కిడ్నాప్ కు గురి అయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు ఎంపీ నివాసంలోకి చొరబడి ఆయన భార్య జ్యోతి, కుమారుడు శరత్ లను కిడ్నాప్ చేశారు. అలాగే ఎంపీ ఆడిటర్ జీవీని కూడా కిడ్నాప్ చేశారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కిడ్నాప్ కేసును సాల్వ్ చేశారు. ముగ్గురిని సురక్షితంగా విడిపించారు.
ఈ కిడ్నాప్ కు పాల్పడింది ముగ్గురు అని పోలీసులు గుర్తించారు.రౌడీ షీటర్ హేమంత్ మరో ముగ్గురితో కలిసి కిడ్నాప్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. వీరి కిడ్నాప్ సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన రంగంలోకి దిగారు. 17 బృందాలుగా ఏర్పడి గాలింపు ముమ్మరం చేశారు. దీంట్లో భాగంగా ఏలూరు వద్ద కిడ్నాపర్లను అదుపులోకి తీసుకుని ముగ్గురిని సురక్షితంగా విడిపించారు. కిడ్నాప్ లు జరిగిన అతి కొద్ది సమయంలోనే పోలీసులు బాధితులను సురక్షితంగా విడిపించటంతో ఊపిరి పీల్చుకున్నారు.
కాగా గతంలో ఓ హత్య కేసులోను, కిడ్నాప్ కేసులోను నిందితుడుగా ఉన్న హేమంత్ ఈ కిడ్నాప్ లకు పాల్పడ్డాడని విశాఖ పోలీసులు తెలిపారు. మరి ఎంపీ కుమారుడిని, భార్యను, ఆడిటల్ జీవిని ఎందుకు కిడ్నాప్ చేశారు? డబ్బుల కోసమా? లేక ఈ కిడ్నాపుల వెనుక మరేదైనా కుట్ర ఉందా? అనే కోణాల్లో నిందితులను విచారిస్తున్నారు పోలీసులు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో







