కిడ్నాప్ అయిన విశాఖ ఎంపీ కుమారుడు, భార్య
- June 15, 2023
విశాఖపట్నం: విశాఖలో కలకలం రేపిన వైసీపీ ఎంపీ ఎవివి సత్యనారాయణ భార్య, కుమారుడు, ఆడిటల్ జీవీ కిడ్నాప్ సుఖాంతమైంది. ఎంపీ, భార్య,కుమారుడు, ఆడిటర్ జీవి సురక్షితంగా విడిపించారు పోలీసులు. వారు ముగ్గురు క్షేమంగా ఉన్నారని ప్రకటించారు. గురువారం (జూన్ 14) ఉదయం ఎంపీ కుమారుడు, భార్య, ఆడిటర్ జీవిలు కిడ్నాప్ కు గురి అయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు ఎంపీ నివాసంలోకి చొరబడి ఆయన భార్య జ్యోతి, కుమారుడు శరత్ లను కిడ్నాప్ చేశారు. అలాగే ఎంపీ ఆడిటర్ జీవీని కూడా కిడ్నాప్ చేశారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కిడ్నాప్ కేసును సాల్వ్ చేశారు. ముగ్గురిని సురక్షితంగా విడిపించారు.
ఈ కిడ్నాప్ కు పాల్పడింది ముగ్గురు అని పోలీసులు గుర్తించారు.రౌడీ షీటర్ హేమంత్ మరో ముగ్గురితో కలిసి కిడ్నాప్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. వీరి కిడ్నాప్ సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన రంగంలోకి దిగారు. 17 బృందాలుగా ఏర్పడి గాలింపు ముమ్మరం చేశారు. దీంట్లో భాగంగా ఏలూరు వద్ద కిడ్నాపర్లను అదుపులోకి తీసుకుని ముగ్గురిని సురక్షితంగా విడిపించారు. కిడ్నాప్ లు జరిగిన అతి కొద్ది సమయంలోనే పోలీసులు బాధితులను సురక్షితంగా విడిపించటంతో ఊపిరి పీల్చుకున్నారు.
కాగా గతంలో ఓ హత్య కేసులోను, కిడ్నాప్ కేసులోను నిందితుడుగా ఉన్న హేమంత్ ఈ కిడ్నాప్ లకు పాల్పడ్డాడని విశాఖ పోలీసులు తెలిపారు. మరి ఎంపీ కుమారుడిని, భార్యను, ఆడిటల్ జీవిని ఎందుకు కిడ్నాప్ చేశారు? డబ్బుల కోసమా? లేక ఈ కిడ్నాపుల వెనుక మరేదైనా కుట్ర ఉందా? అనే కోణాల్లో నిందితులను విచారిస్తున్నారు పోలీసులు.
తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







