కిడ్నాప్ అయిన విశాఖ ఎంపీ కుమారుడు, భార్య
- June 15, 2023
విశాఖపట్నం: విశాఖలో కలకలం రేపిన వైసీపీ ఎంపీ ఎవివి సత్యనారాయణ భార్య, కుమారుడు, ఆడిటల్ జీవీ కిడ్నాప్ సుఖాంతమైంది. ఎంపీ, భార్య,కుమారుడు, ఆడిటర్ జీవి సురక్షితంగా విడిపించారు పోలీసులు. వారు ముగ్గురు క్షేమంగా ఉన్నారని ప్రకటించారు. గురువారం (జూన్ 14) ఉదయం ఎంపీ కుమారుడు, భార్య, ఆడిటర్ జీవిలు కిడ్నాప్ కు గురి అయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు ఎంపీ నివాసంలోకి చొరబడి ఆయన భార్య జ్యోతి, కుమారుడు శరత్ లను కిడ్నాప్ చేశారు. అలాగే ఎంపీ ఆడిటర్ జీవీని కూడా కిడ్నాప్ చేశారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కిడ్నాప్ కేసును సాల్వ్ చేశారు. ముగ్గురిని సురక్షితంగా విడిపించారు.
ఈ కిడ్నాప్ కు పాల్పడింది ముగ్గురు అని పోలీసులు గుర్తించారు.రౌడీ షీటర్ హేమంత్ మరో ముగ్గురితో కలిసి కిడ్నాప్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. వీరి కిడ్నాప్ సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన రంగంలోకి దిగారు. 17 బృందాలుగా ఏర్పడి గాలింపు ముమ్మరం చేశారు. దీంట్లో భాగంగా ఏలూరు వద్ద కిడ్నాపర్లను అదుపులోకి తీసుకుని ముగ్గురిని సురక్షితంగా విడిపించారు. కిడ్నాప్ లు జరిగిన అతి కొద్ది సమయంలోనే పోలీసులు బాధితులను సురక్షితంగా విడిపించటంతో ఊపిరి పీల్చుకున్నారు.
కాగా గతంలో ఓ హత్య కేసులోను, కిడ్నాప్ కేసులోను నిందితుడుగా ఉన్న హేమంత్ ఈ కిడ్నాప్ లకు పాల్పడ్డాడని విశాఖ పోలీసులు తెలిపారు. మరి ఎంపీ కుమారుడిని, భార్యను, ఆడిటల్ జీవిని ఎందుకు కిడ్నాప్ చేశారు? డబ్బుల కోసమా? లేక ఈ కిడ్నాపుల వెనుక మరేదైనా కుట్ర ఉందా? అనే కోణాల్లో నిందితులను విచారిస్తున్నారు పోలీసులు.
తాజా వార్తలు
- ఈద్ అల్ అదా 2026 తేదీ ఖరారు చేసిన దేశాలు..
- అబుదాబి బరాకా అణు విద్యుత్ కేంద్రం వద్ద డ్రోన్ దాడి..అగ్నిప్రమాదం
- చిల్కూరు బాలాజీ ఆలయం పై అమెరికా సెనేటర్ అనుచిత వ్యాఖ్యలు
- విదేశీ నియామకాలను అధిగమించిన బహ్రెయిన్ ఉద్యోగాలు..!!
- జీసీసీ ‘వాఫెడ్’: ప్రవాస కార్మికులకు వైద్య పరీక్షలు..!!
- సౌదీలో 7రోజుల్లో 11,272 మంది నివాసితులు బహిష్కరణ..!!
- ఆన్లైన్ లో వ్యాఖ్యల పై యూఏఈ వార్నింగ్.. Dh500,000 ఫైన్..!!
- దోహా మెట్రోలో జర్నీ టూవర్డ్ హెల్త్ ఈవెంట్..!!
- ఒమన్ పాస్పోర్ట్ ర్యాంకింగ్ మెరుగు..!!
- ఎబోలాతో 88 మంది మృతి.. గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన WHO









