పాఠశాల పై దాడి చేసిన ఉగ్రవాదులు..25 మంది మృతి
- June 17, 2023
ఉగాండా: ఉగాండాలోని డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో సరిహద్దుకు సమీపంలో ఉన్న పాఠశాలపై ఇస్టామిక్ స్టేట్ ఉగ్రవాదులు చేసిన దాడిలో 25 మంది చనిపోయారు. కాగా, మరికొందరిని అపహరించినట్లు పోలీసులు శనివారం తెలిపారు. అపహరణకు గురైన వారిని రక్షించేందుకు, ఈ బృందాన్ని నాశనం చేసేందుకు తమ బలగాలు శత్రువులను వెంబడిస్తున్నాయని రక్షణ ప్రతినిధి ఫెలిక్స్ కులాయిగ్యే ట్విట్టర్ ద్వారా తెలిపారు.
దాడికి పాల్పడిన వారు ఇస్లామిక్ స్టేట్కు విధేయత చూపుతున్న తిరుగుబాటు గ్రూపు అలైడ్ డెమోక్రటిక్ ఫోర్సెస్ (ఎడిఎఫ్) సభ్యులని తెలిపిన అధికారులు దాడి చేసినవారు ఎంత మందిని అపహరించారనే వివరాలు వెల్లడించలేదు. దుండగులు శుక్రవారం అర్థరాత్రి పశ్చిమ సరిహద్దు పట్టణమైన మ్పోండ్వేలోని లుబిరిరా సెకండరీ స్కూల్పై దాడి చేసి, డార్మిటరీని తగలబెట్టి, ఆహారాన్ని దోచుకున్నారని పోలీసులు తెలిపారు.
“ఇప్పటి వరకు 25 మృతదేహాలను పాఠశాల నుంచి వెలికితీసి బ్వేరా ఆసుపత్రికి తరలించాము. అలాగే ప్రాణాలతో ఉన్న ఎనిమిది మంది బాధితులు బ్వేరా ఆసుపత్రిలో క్లిష్ట పరిస్థితిలో చికిత్స తీసుకుంటున్నారు” అని పోలీసులు ట్విట్టర్లో తెలిపారు. మృతుల్లో ఎంత మంది పాఠశాల విద్యార్థులు ఉన్నారో పోలీసులు వెల్లడించలేదు. దాడి చేసిన వారు కాంగోలోని విరుంగా నేషనల్ పార్క్ వైపు పారిపోయారని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు







