పాఠశాల పై దాడి చేసిన ఉగ్రవాదులు..25 మంది మృతి
- June 17, 2023
ఉగాండా: ఉగాండాలోని డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో సరిహద్దుకు సమీపంలో ఉన్న పాఠశాలపై ఇస్టామిక్ స్టేట్ ఉగ్రవాదులు చేసిన దాడిలో 25 మంది చనిపోయారు. కాగా, మరికొందరిని అపహరించినట్లు పోలీసులు శనివారం తెలిపారు. అపహరణకు గురైన వారిని రక్షించేందుకు, ఈ బృందాన్ని నాశనం చేసేందుకు తమ బలగాలు శత్రువులను వెంబడిస్తున్నాయని రక్షణ ప్రతినిధి ఫెలిక్స్ కులాయిగ్యే ట్విట్టర్ ద్వారా తెలిపారు.
దాడికి పాల్పడిన వారు ఇస్లామిక్ స్టేట్కు విధేయత చూపుతున్న తిరుగుబాటు గ్రూపు అలైడ్ డెమోక్రటిక్ ఫోర్సెస్ (ఎడిఎఫ్) సభ్యులని తెలిపిన అధికారులు దాడి చేసినవారు ఎంత మందిని అపహరించారనే వివరాలు వెల్లడించలేదు. దుండగులు శుక్రవారం అర్థరాత్రి పశ్చిమ సరిహద్దు పట్టణమైన మ్పోండ్వేలోని లుబిరిరా సెకండరీ స్కూల్పై దాడి చేసి, డార్మిటరీని తగలబెట్టి, ఆహారాన్ని దోచుకున్నారని పోలీసులు తెలిపారు.
“ఇప్పటి వరకు 25 మృతదేహాలను పాఠశాల నుంచి వెలికితీసి బ్వేరా ఆసుపత్రికి తరలించాము. అలాగే ప్రాణాలతో ఉన్న ఎనిమిది మంది బాధితులు బ్వేరా ఆసుపత్రిలో క్లిష్ట పరిస్థితిలో చికిత్స తీసుకుంటున్నారు” అని పోలీసులు ట్విట్టర్లో తెలిపారు. మృతుల్లో ఎంత మంది పాఠశాల విద్యార్థులు ఉన్నారో పోలీసులు వెల్లడించలేదు. దాడి చేసిన వారు కాంగోలోని విరుంగా నేషనల్ పార్క్ వైపు పారిపోయారని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







