పాఠశాల పై దాడి చేసిన ఉగ్రవాదులు..25 మంది మృతి
- June 17, 2023
ఉగాండా: ఉగాండాలోని డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో సరిహద్దుకు సమీపంలో ఉన్న పాఠశాలపై ఇస్టామిక్ స్టేట్ ఉగ్రవాదులు చేసిన దాడిలో 25 మంది చనిపోయారు. కాగా, మరికొందరిని అపహరించినట్లు పోలీసులు శనివారం తెలిపారు. అపహరణకు గురైన వారిని రక్షించేందుకు, ఈ బృందాన్ని నాశనం చేసేందుకు తమ బలగాలు శత్రువులను వెంబడిస్తున్నాయని రక్షణ ప్రతినిధి ఫెలిక్స్ కులాయిగ్యే ట్విట్టర్ ద్వారా తెలిపారు.
దాడికి పాల్పడిన వారు ఇస్లామిక్ స్టేట్కు విధేయత చూపుతున్న తిరుగుబాటు గ్రూపు అలైడ్ డెమోక్రటిక్ ఫోర్సెస్ (ఎడిఎఫ్) సభ్యులని తెలిపిన అధికారులు దాడి చేసినవారు ఎంత మందిని అపహరించారనే వివరాలు వెల్లడించలేదు. దుండగులు శుక్రవారం అర్థరాత్రి పశ్చిమ సరిహద్దు పట్టణమైన మ్పోండ్వేలోని లుబిరిరా సెకండరీ స్కూల్పై దాడి చేసి, డార్మిటరీని తగలబెట్టి, ఆహారాన్ని దోచుకున్నారని పోలీసులు తెలిపారు.
“ఇప్పటి వరకు 25 మృతదేహాలను పాఠశాల నుంచి వెలికితీసి బ్వేరా ఆసుపత్రికి తరలించాము. అలాగే ప్రాణాలతో ఉన్న ఎనిమిది మంది బాధితులు బ్వేరా ఆసుపత్రిలో క్లిష్ట పరిస్థితిలో చికిత్స తీసుకుంటున్నారు” అని పోలీసులు ట్విట్టర్లో తెలిపారు. మృతుల్లో ఎంత మంది పాఠశాల విద్యార్థులు ఉన్నారో పోలీసులు వెల్లడించలేదు. దాడి చేసిన వారు కాంగోలోని విరుంగా నేషనల్ పార్క్ వైపు పారిపోయారని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు