పాఠశాల పై దాడి చేసిన ఉగ్రవాదులు..25 మంది మృతి
- June 17, 2023
ఉగాండా: ఉగాండాలోని డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో సరిహద్దుకు సమీపంలో ఉన్న పాఠశాలపై ఇస్టామిక్ స్టేట్ ఉగ్రవాదులు చేసిన దాడిలో 25 మంది చనిపోయారు. కాగా, మరికొందరిని అపహరించినట్లు పోలీసులు శనివారం తెలిపారు. అపహరణకు గురైన వారిని రక్షించేందుకు, ఈ బృందాన్ని నాశనం చేసేందుకు తమ బలగాలు శత్రువులను వెంబడిస్తున్నాయని రక్షణ ప్రతినిధి ఫెలిక్స్ కులాయిగ్యే ట్విట్టర్ ద్వారా తెలిపారు.
దాడికి పాల్పడిన వారు ఇస్లామిక్ స్టేట్కు విధేయత చూపుతున్న తిరుగుబాటు గ్రూపు అలైడ్ డెమోక్రటిక్ ఫోర్సెస్ (ఎడిఎఫ్) సభ్యులని తెలిపిన అధికారులు దాడి చేసినవారు ఎంత మందిని అపహరించారనే వివరాలు వెల్లడించలేదు. దుండగులు శుక్రవారం అర్థరాత్రి పశ్చిమ సరిహద్దు పట్టణమైన మ్పోండ్వేలోని లుబిరిరా సెకండరీ స్కూల్పై దాడి చేసి, డార్మిటరీని తగలబెట్టి, ఆహారాన్ని దోచుకున్నారని పోలీసులు తెలిపారు.
“ఇప్పటి వరకు 25 మృతదేహాలను పాఠశాల నుంచి వెలికితీసి బ్వేరా ఆసుపత్రికి తరలించాము. అలాగే ప్రాణాలతో ఉన్న ఎనిమిది మంది బాధితులు బ్వేరా ఆసుపత్రిలో క్లిష్ట పరిస్థితిలో చికిత్స తీసుకుంటున్నారు” అని పోలీసులు ట్విట్టర్లో తెలిపారు. మృతుల్లో ఎంత మంది పాఠశాల విద్యార్థులు ఉన్నారో పోలీసులు వెల్లడించలేదు. దాడి చేసిన వారు కాంగోలోని విరుంగా నేషనల్ పార్క్ వైపు పారిపోయారని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- స్కూల్ అడ్మిషన్స్..కొత్త కట్ ఆఫ్ తేదీ పై పేరెంట్స్ ఆందోళన..!!
- సౌదీలో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- దోహా చేరుకున్న జర్మనీ ఛాన్సలర్..!!
- ట్రాఫిక్ అలెర్ట్.. కీలక గల్ఫ్ స్ట్రీట్ మూసివేత..!!
- నెస్లే మరో బ్యాచ్ బేబీ ఫార్ములా రికాల్..!!
- వకాన్ విలేజ్ కు పోటెత్తిన విజిటర్స్..!!
- దుబాయ్ స్కూళ్లలో ఏఐ (AI) పాఠాలు
- నైజీరియాలో 200 మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులు
- కేదార్నాథ్: యాత్రికుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు.. సురక్షిత ప్రయాణం
- ఉగాది, కళారత్న పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం







