సినిమా షూటింగ్లో గాయపడిన వరుణ్ సందేశ్..
- June 21, 2023
హైదరాబాద్: సినిమా షూటింగ్లో యంగ్ హీరో వరుణ్ సందేశ్ గాయపడ్డాడు. తన కొత్త సినిమాకు సంబంధించి ఫైటింగ్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా గాయపడడంతో వెంటనే అతడిని ఆస్పత్రికి తీసుకువెళ్లారు. వైద్యులు అతడికి మూడు వారాలు విశ్రాంతి అవసరం అని సూచించారు. దీంతో చిత్ర షూటింగ్ వాయిదా వేశారు.
వరుణ్ సందేశ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ది కానిస్టేబుల్’. ఆర్యన్ శుభాన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. జాగృతి మూవీ మేకర్స్ బ్యానర్పై ఈ సినిమా తెరకెక్కుతోంది. బలగం జగదీశ్ నిర్మాత కాగా.. ఓ కానిస్టేబుల్ జీవితమే కథగా ఈ సినిమా తెరకెక్కుతోంది. హైదరాబాద్ శివార్లలో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఫైటింగ్ సీక్వెన్స్ తెరకెక్కిస్తుండగా వరుణ్ సందేశ్ కాలికి గాయమైంది. వెంటనే చిత్రబృందం అతడికి ఆస్పత్రికి తీసుకువెళ్లింది.
చికిత్స అందించిన వైద్యులు మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో ‘ది కానిస్టేబుల్’ షూటింగ్ను వాయిదా వేసినట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఇప్పటికే 40 శాతం చిత్రీకరణ పూర్తైందని, వరుణ్ కోలుకున్నాక మిగతా షూటింగ్ను పూర్తి చేస్తామని వెల్లడించారు.
‘హ్యాపీడేస్’ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు వరుణ్ సందేశ్. ‘కొత్త బంగారు లోకం’ చిత్రంతో ప్రేక్షకుల మదిలో చెదరని ముద్ర వేశాడు. అయితే ఇటీవల అతడు నటించిన సినిమాలు ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదు. చివరగా ‘ఇందువదన’ అనే హారర్ కామెడీతో వచ్చినా ఆకట్టుకోలేకపోయాడు. ప్రస్తుతం వరుణ్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి ‘ది కానిస్టేబుల్’ కాగా మరొకటి ‘చిత్రం చూడరా’. ఈ రెండు సినిమాలపై వరుణ్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







