దారుణంగా నష్టపోయిన ‘ఆదిపురుష్’.!
- June 22, 2023
ప్రతిష్టాత్మక చిత్రంగా తెరకెక్కి, దారుణంగా విమర్శల పాలైన సినిమా ‘ఆదిపురుష్’. ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అని డైరెక్ట్గా తెలుస్తున్నప్పటికీ చిత్ర యూనిట్, ట్రేడ్ వర్గాలు మాత్రం 300 కోట్లు, 400 కోట్ల వసూళ్లు.. అంటూ అనౌన్స్మెంట్లు రిలీజ్ చేస్తున్నారు.
కానీ, అంత సీనూ సినిమా లేదు ‘ఆది పురుష్’కి. అందుకు పూర్తి భిన్నంగా వుంది పరిస్థితి. వసూళ్లు దారుణంగా పడిపోయాయ్. నార్త్లో కొంతవరకూ బెటర్. తక్కువ నష్టాలతోనే బయటపడొచ్చునంటున్నారు. కానీ, సౌత్ పరిస్థితి ఘోరంగా వుంది.
ఏదో పబ్లిసిటీతో అలా నెట్టుకొచ్చేస్తున్నారు. కానీ, నిర్మాతలు చెప్పుకోలేక, విప్పుకోలేక అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. వరుసగా ప్రబాస్ నుంచి ఇది మూడో సినిమా ఇలా నష్టాల్లో మునిగిపోవడం. దాంతో, ప్రబాస్ ఇమేజ్కి బాగా డ్యామేజ్ ఏర్పడిపోయింది. ఈ డ్యామేజ్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలియని పరిస్థితిలో ప్రబాస్ వున్నాడట.
అన్నట్లు వీకెండ్ స్పెషల్గా ‘ఆదిపురుష్’ సినిమా టిక్కెట్ల రేట్లను కూడా తగ్గించేశారట. అయినా ఈ సినిమాపై ఎవ్వరూ ఆసక్తి చూపించకపోవడం విశేషం.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









