సాయికుమార్తో ఎమోషనల్ సినిమా తీయనున్న జబర్దస్త్ కమెడియన్
- June 23, 2023
హైదరాబాద్: జబర్దస్త్ షో ఎంతోమందికి లైఫ్ ఇచ్చింది. కమెడియన్స్, రైటర్స్, టెక్నీషియన్స్.. ఇలా ఇక్కడ కెరీర్ మొదలుపెట్టిన వాళ్ళు ఇప్పుడు స్టార్స్ హోదాలో ఉన్నారు. జబర్దస్త్ లో కమెడియన్ గా, రైటర్ గా మెప్పించిన పలువురు ఇప్పుడు దర్శకులుగా మారుతున్నారు. తాజాగా జబర్దస్త్ కమెడియన్ శాంతి కుమార్ దర్శకుడిగా మారి సినిమా చేస్తున్నారు.
మిమిక్రి ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టిన శాంతి కుమార్ జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చి అనంతరం టీంలీడర్ గా కూడా ఎదిగారు. కొన్నాళ్ల క్రితం జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేశారు. ప్రస్తుతం దర్శకుడిగా సినిమా చేస్తున్నారు జబర్దస్త్ శాంతి కుమార్. సాయి కుమార్, ఆదిత్య ఓం ముఖ్యపాత్రల్లో ‘నాతో నేను’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు శాంతి కుమార్. ఎమోషనల్ కథతో ఈ సినిమా ఉండనున్నట్టు సమాచారం. ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, కొన్ని పాటలు, దర్శకత్వం అన్ని శాంతి కుమార్ చేయడం విశేషం.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. తాజాగా ఈ సినిమా నుంచి ఓ పాటని ఆది సాయికుమార్ రిలీజ్ చేశాడు. ఈ నేపథ్యంలో జబర్దస్త్ శాంతి కుమార్ మాట్లాడుతూ.. జబర్దస్త్ ద్వారా కమెడియన్ గా నన్ను ఆదరించారు. ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేసి దర్శకుడిగా మారాను. ఇది నా తొలిప్రయాణం. ఈ సినిమాకు కథ, మాటలు, పాటలు అన్ని నేనే రాసుకొని కొత్త నిర్మాతల సహకారంతో సినిమా చేస్తున్నాను. ఈ సినిమాలో సాయి కుమార్ పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. దర్శకుడిగా కూడా నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను అని తెలిపారు.
తాజా వార్తలు
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!







