సాయికుమార్తో ఎమోషనల్ సినిమా తీయనున్న జబర్దస్త్ కమెడియన్
- June 23, 2023
హైదరాబాద్: జబర్దస్త్ షో ఎంతోమందికి లైఫ్ ఇచ్చింది. కమెడియన్స్, రైటర్స్, టెక్నీషియన్స్.. ఇలా ఇక్కడ కెరీర్ మొదలుపెట్టిన వాళ్ళు ఇప్పుడు స్టార్స్ హోదాలో ఉన్నారు. జబర్దస్త్ లో కమెడియన్ గా, రైటర్ గా మెప్పించిన పలువురు ఇప్పుడు దర్శకులుగా మారుతున్నారు. తాజాగా జబర్దస్త్ కమెడియన్ శాంతి కుమార్ దర్శకుడిగా మారి సినిమా చేస్తున్నారు.
మిమిక్రి ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టిన శాంతి కుమార్ జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చి అనంతరం టీంలీడర్ గా కూడా ఎదిగారు. కొన్నాళ్ల క్రితం జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేశారు. ప్రస్తుతం దర్శకుడిగా సినిమా చేస్తున్నారు జబర్దస్త్ శాంతి కుమార్. సాయి కుమార్, ఆదిత్య ఓం ముఖ్యపాత్రల్లో ‘నాతో నేను’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు శాంతి కుమార్. ఎమోషనల్ కథతో ఈ సినిమా ఉండనున్నట్టు సమాచారం. ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, కొన్ని పాటలు, దర్శకత్వం అన్ని శాంతి కుమార్ చేయడం విశేషం.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. తాజాగా ఈ సినిమా నుంచి ఓ పాటని ఆది సాయికుమార్ రిలీజ్ చేశాడు. ఈ నేపథ్యంలో జబర్దస్త్ శాంతి కుమార్ మాట్లాడుతూ.. జబర్దస్త్ ద్వారా కమెడియన్ గా నన్ను ఆదరించారు. ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేసి దర్శకుడిగా మారాను. ఇది నా తొలిప్రయాణం. ఈ సినిమాకు కథ, మాటలు, పాటలు అన్ని నేనే రాసుకొని కొత్త నిర్మాతల సహకారంతో సినిమా చేస్తున్నాను. ఈ సినిమాలో సాయి కుమార్ పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. దర్శకుడిగా కూడా నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను అని తెలిపారు.
తాజా వార్తలు
- చైనా ప్రధాని లీ చియాంగ్తో అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ కీలక భేటీ
- ఇరాన్కు ట్రంప్ అల్టిమేటం!
- రాజస్థాన్ పై హైదరాబాద్ విజయం
- గమ్యస్థానానికి సురక్షితంగా చేరుదాం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇరాన్ ఓడరేవులను దిగ్బంధించిన అమెరికా
- బెట్టింగ్లు, జూదం పై కఠిన చర్యలు: డిజిపి హరీష్ కుమార్ గుప్తా
- మహిళల టీ20 ప్రపంచ కప్: రికార్డు స్థాయిలో రూ.81 కోట్ల ప్రైజ్ మనీ!
- ఖతార్ ఎయిర్వేస్ ప్రయాణికులకు గుడ్ న్యూస్...
- యూఏఈ అధ్యక్షుడు–బహ్రెయిన్ రాజు భేటీ..
- డిగ్రీ అడ్మిషన్ల షెడ్యూల్ మరియు ముఖ్యమైన తేదీలు!









