జింజర్ డ్రింక్తో జోబిడెన్,మోదీల ఛీర్స్
- June 23, 2023
అమెరికా: అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ప్రథమ మహిళ జిల్ బిడెన్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గౌరవార్థం వైట్హౌస్లో ఇచ్చిన స్టేట్ డిన్నర్ లో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. జోబిడెన్, మోదీలిద్దరూ ఎన్నడూ మద్యం ముట్టని వారే కావడంతో…వారిద్దరూ అల్కహాల్ లేకుండా జింజర్ డ్రింకుతో గ్లాసులు పైకెత్తి ఛీర్స్ చెప్పారు. జో బిడెన్ వైట్హౌస్లో రాష్ట్ర విందు సందర్భంగా టోస్ట్ చేస్తున్నప్పుడు తన తాత చెప్పిన సలహాను మోదీతో పంచుకున్నారు.
ఆల్కహాల్ లేకుండా టోస్ట్ పెంచడం గురించి తన తాత సలహాను వివరించినప్పుడు మోదీతో సహా అతిథులంతా నవ్వారు. 400 మంది అతిథులు హాజరైన హై-ప్రొఫైల్ డిన్నర్ ఈవెంట్లో మోదీకి జో బిడెన్ టోస్ట్ అందించారు. టోస్ట్ ఇస్తే గ్లాసులో ఆల్కహాల్ లేకపోతే మీరు దాన్ని మీ ఎడమచేతితో తాగాలని తన తాత ఆంబ్రోస్ ఫిన్నెగాన్ చెప్పారని జోబిడెన్ తన పాత స్మృతులను గుర్తు చేసుకున్నారు.
బిడెన్ చెప్పిన విషయాన్ని అనువాదకుడు హిందీలోకి అనువదిస్తుండగా అతిథులంతా ఫక్కున నవ్వారు. ‘‘ఈ రోజు భారత ప్రధానమంత్రితో కలిసి మేం అద్భుత సమయాన్ని గడిపాం, ఈ రాత్రి భారత్, యూఎస్ మధ్య గొప్ప స్నేహ బంధం ఏర్పడింది’’ అని బిడెన్ మోదీతో కలిసి డ్రింక్ గ్లాస్ పైకెత్తి ఛీర్స్ చెప్పారు. తనకు ఈ అద్భుత విందు ఇచ్చినందుకు మోదీ జోబిడెన్ కు ధన్యవాదాలు తెలిపారు.
తాజా వార్తలు
- ఫిఫా ప్రపంచ కప్ ఖతార్ 2022 లెగసీ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- 13 సంస్థలపై SR37 మిలియన్ల జరిమానా..!!
- రెండు దేశాలతో ఎయిర్ సర్వీసులకు సుల్తాన్ ఆమోదం..!!
- కువైట్ లో కొత్త రెసిడెన్సీ ఉల్లంఘన జరిమానాలు..!!
- ICRF ఫేబర్-కాస్టెల్ స్పెక్ట్రమ్ క్యాలెండర్ 2026 ఆవిష్కరణ..!!
- దుబాయ్ లో ఆ 4 బీచ్లు ఫ్యామిలీల కోసమే..!!
- ఇండిగో పైలట్ రిక్రూట్మెంట్లో భారీ మార్పులు
- మల్కాజిగిరి తొలి కమీషనర్ గా బాధ్యతలు చేపట్టిన అవినాష్ మహంతి
- తిరుమలలో వైభవంగా వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం
- ఇక పై వాట్సాప్లోనే ఆర్టీసీ టికెట్ బుకింగ్..







