మహిళను ఢీకొట్టిన డ్రైవర్. 200,000 దిర్హామ్ బ్లడ్ మనీ చెల్లించాలని ఆదేశం
- June 30, 2023
యూఏఈ: రెడ్ లైట్ నిబంధనను ఉల్లంఘించి, వాహనంతో ఇద్దరు మహిళలపైకి దూసుకెళ్లిన అరబ్ యువకుడి జైలు శిక్ష పడింది. ఈ ఘటనలో ఒక మహిళ మరణించగా.. మరొకరు గాయపడ్డారు. కేసును విచారించిన ఖోర్ ఫక్కన్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ Dh5,000 జరిమానా, Dh200,000 బ్లడ్ మనీని వ్యక్తిగతంగా లేదా ప్రమాదానికి గురైన వాహనానికి బీమా చేసిన కంపెనీతో కలిసి చెల్లించాలని ఆదేశించింది. రెడ్ లైట్ సిగ్నల్ పడ్డ సమయంలో జంక్షన్ వద్ద వాహనాన్ని ఆపకుండా డ్రైవర్ నిర్లక్ష్యం, అజాగ్రత్త కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని నివేదికలో పేర్కొన్నారు. డ్రైవర్ నేరాన్ని అంగీకరించాడు. ప్రమాదవశాత్తు బాధితుల మరణానికి/గాయానికి కారణమైనందుకు కోర్టు అతన్ని దోషిగా నిర్ధారించింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఆర్టికల్స్ (88), (87) నిబంధనల ప్రకారం, డ్రైవర్ను ఏడాది పాటు జైలులో పెట్టాలని కోర్టు తీర్పునిచ్చింది. బాధితురాలు వారసులకు 200,000 దిర్హామ్ల చట్టబద్ధమైన రక్త ధనం చెల్లించాలని ఆదేశించింది. నిందితుడు తీర్పుపై అప్పీల్ చేయగా, అప్పీల్ను తిరస్కరించాలని పబ్లిక్ ప్రాసిక్యూషన్ కోర్టును అభ్యర్థించింది.
తాజా వార్తలు
- అబుదాబి ‘ది కార్స్’ కాన్సర్ట్ రద్దు.. టికెట్ డబ్బులు రీఫండ్..!!
- స్కూల్స్ రీ ఓపెన్.. సౌదీ ఫుడ్ అథారిటీ కీలక సూచనలు..!!
- ఖతార్లో కొత్త డ్రోన్ చట్టంపై అవగాహన కార్యక్రమం..!!
- కువైట్లో ఫ్లాషింగ్ ట్రాఫిక్ సిగ్నల్స్.. ఢీకొనే ప్రమాదాలకు చెక్..!!
- ఒమన్లో ఘనంగా రాజస్థానీ మహిళల ‘తీజ్ ఉత్సవ్’..!!
- సైరన్లను నిర్లక్ష్యం చేయొద్దు.. బయటకు రావొద్దు..!!
- రష్యాలో డ్రోన్ దాడి.. భారత విద్యార్థికి గాయాలు
- బెంగాల్ యువకుడికి అండగా నిలిచిన అనంత్ అంబానీ
- ఇండిగో వెబ్సైట్ క్రాష్.. ఆన్లైన్ సేవలకు తీవ్ర అంతరాయం..!
- అబుదాబిలో అక్రమంగా కార్ వాష్ చేస్తే Dh4,000 వరకు జరిమానా







