మహిళను ఢీకొట్టిన డ్రైవర్. 200,000 దిర్హామ్ బ్లడ్ మనీ చెల్లించాలని ఆదేశం
- June 30, 2023
యూఏఈ: రెడ్ లైట్ నిబంధనను ఉల్లంఘించి, వాహనంతో ఇద్దరు మహిళలపైకి దూసుకెళ్లిన అరబ్ యువకుడి జైలు శిక్ష పడింది. ఈ ఘటనలో ఒక మహిళ మరణించగా.. మరొకరు గాయపడ్డారు. కేసును విచారించిన ఖోర్ ఫక్కన్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ Dh5,000 జరిమానా, Dh200,000 బ్లడ్ మనీని వ్యక్తిగతంగా లేదా ప్రమాదానికి గురైన వాహనానికి బీమా చేసిన కంపెనీతో కలిసి చెల్లించాలని ఆదేశించింది. రెడ్ లైట్ సిగ్నల్ పడ్డ సమయంలో జంక్షన్ వద్ద వాహనాన్ని ఆపకుండా డ్రైవర్ నిర్లక్ష్యం, అజాగ్రత్త కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని నివేదికలో పేర్కొన్నారు. డ్రైవర్ నేరాన్ని అంగీకరించాడు. ప్రమాదవశాత్తు బాధితుల మరణానికి/గాయానికి కారణమైనందుకు కోర్టు అతన్ని దోషిగా నిర్ధారించింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఆర్టికల్స్ (88), (87) నిబంధనల ప్రకారం, డ్రైవర్ను ఏడాది పాటు జైలులో పెట్టాలని కోర్టు తీర్పునిచ్చింది. బాధితురాలు వారసులకు 200,000 దిర్హామ్ల చట్టబద్ధమైన రక్త ధనం చెల్లించాలని ఆదేశించింది. నిందితుడు తీర్పుపై అప్పీల్ చేయగా, అప్పీల్ను తిరస్కరించాలని పబ్లిక్ ప్రాసిక్యూషన్ కోర్టును అభ్యర్థించింది.
తాజా వార్తలు
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు
- నకిలీ సమ్మర్ ట్రావెల్ ఆఫర్ల పై అప్రమత్తంగా ఉండండి..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ట్యాక్స్ పెనాల్టీ మాఫీ పథకాన్ని పొడిగించిన సౌదీ అరేబియా..!!
- యునెస్కోలో సుల్తాన్ హైథమ్ చారిత్రక ప్రసంగం..!!
- రాయల్ యూనివర్శిటీ ఫర్ విమెన్ లో ఘనంగా 18వ స్నాతకోత్సవం..!!
- పాస్పోర్ట్, కాన్సులర్ సేవల రుసుములను సవరించిన ఎంబసీ..!!
- జూలై నెల పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- మే నెలలో QR1.73 బిలియన్ల విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలు..!!
- తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్!







