ఆసియా క్రీడల సదస్సులో పాల్గొన్న బహ్రెయిన్ అధికారులు
- June 30, 2023
బహ్రెయిన్: చైనాలో సెప్టెంబర్ 23 నుండి అక్టోబర్ 8 వరకు జరగనున్న రాబోయే ఏషియాడ్ కోసం నిర్వహించిన సమావేశంలో హాంగ్జౌ ఆసియా క్రీడలకు బహ్రెయిన్ చెఫ్ డి మిషన్, అహ్మద్ అబ్దుల్గఫార్ పాల్గొన్నారు. వీరితో పాటు బహ్రెయిన్ ఒలింపిక్ కమిటీ ఫోటోగ్రాఫర్ అలీ అల్ హల్వాచి కూడా హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రతినిధుల రాక, హోటళ్లు, అథ్లెట్లు , మీడియా విలేజ్, పోషణ, రవాణా, స్టేడియంలు, ఇతర క్రీడా సౌకర్యాలు, ప్రారంభ - ముగింపు వేడుకలు మొదలైన వాటితో సహా ఆటల నిర్వహణకు సంబంధించిన అన్ని అంశాలపై చర్చించారు. క్రీడల సందర్భంగా ఈవెంట్లు మొత్తం 54 ప్రాంతాలలో నిర్వహించబడతాయి. మరో 31 శిక్షణ కోసం కేటాయించబడ్డాయి. అథ్లెట్లను రవాణా చేయడానికి డ్రైవర్లు లేకుండా స్మార్ట్ కార్లను వినియోగించనున్నారు. ప్రపంచం నలుమూలల నుండి దాదాపు 12,000 మంది మీడియా నిపుణులు ఈ క్రీడలను కవర్ చేస్తారని కూడా ప్రకటించారు. కాన్ఫరెన్స్ తర్వాత వివిధ క్రీడా సౌకర్యాలు, స్టేడియంలలో ఫీల్డ్ టూర్ నిర్వహించారు.
తాజా వార్తలు
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు
- నకిలీ సమ్మర్ ట్రావెల్ ఆఫర్ల పై అప్రమత్తంగా ఉండండి..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ట్యాక్స్ పెనాల్టీ మాఫీ పథకాన్ని పొడిగించిన సౌదీ అరేబియా..!!
- యునెస్కోలో సుల్తాన్ హైథమ్ చారిత్రక ప్రసంగం..!!
- రాయల్ యూనివర్శిటీ ఫర్ విమెన్ లో ఘనంగా 18వ స్నాతకోత్సవం..!!
- పాస్పోర్ట్, కాన్సులర్ సేవల రుసుములను సవరించిన ఎంబసీ..!!
- జూలై నెల పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- మే నెలలో QR1.73 బిలియన్ల విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలు..!!
- తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్!







