ఆసియా క్రీడల సదస్సులో పాల్గొన్న బహ్రెయిన్ అధికారులు
- June 30, 2023
బహ్రెయిన్: చైనాలో సెప్టెంబర్ 23 నుండి అక్టోబర్ 8 వరకు జరగనున్న రాబోయే ఏషియాడ్ కోసం నిర్వహించిన సమావేశంలో హాంగ్జౌ ఆసియా క్రీడలకు బహ్రెయిన్ చెఫ్ డి మిషన్, అహ్మద్ అబ్దుల్గఫార్ పాల్గొన్నారు. వీరితో పాటు బహ్రెయిన్ ఒలింపిక్ కమిటీ ఫోటోగ్రాఫర్ అలీ అల్ హల్వాచి కూడా హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రతినిధుల రాక, హోటళ్లు, అథ్లెట్లు , మీడియా విలేజ్, పోషణ, రవాణా, స్టేడియంలు, ఇతర క్రీడా సౌకర్యాలు, ప్రారంభ - ముగింపు వేడుకలు మొదలైన వాటితో సహా ఆటల నిర్వహణకు సంబంధించిన అన్ని అంశాలపై చర్చించారు. క్రీడల సందర్భంగా ఈవెంట్లు మొత్తం 54 ప్రాంతాలలో నిర్వహించబడతాయి. మరో 31 శిక్షణ కోసం కేటాయించబడ్డాయి. అథ్లెట్లను రవాణా చేయడానికి డ్రైవర్లు లేకుండా స్మార్ట్ కార్లను వినియోగించనున్నారు. ప్రపంచం నలుమూలల నుండి దాదాపు 12,000 మంది మీడియా నిపుణులు ఈ క్రీడలను కవర్ చేస్తారని కూడా ప్రకటించారు. కాన్ఫరెన్స్ తర్వాత వివిధ క్రీడా సౌకర్యాలు, స్టేడియంలలో ఫీల్డ్ టూర్ నిర్వహించారు.
తాజా వార్తలు
- ఒమన్లో ఘనంగా రాజస్థానీ మహిళల ‘తీజ్ ఉత్సవ్’..!!
- సైరన్లను నిర్లక్ష్యం చేయొద్దు.. బయటకు రావొద్దు..!!
- రష్యాలో డ్రోన్ దాడి.. భారత విద్యార్థికి గాయాలు
- బెంగాల్ యువకుడికి అండగా నిలిచిన అనంత్ అంబానీ
- ఇండిగో వెబ్సైట్ క్రాష్.. ఆన్లైన్ సేవలకు తీవ్ర అంతరాయం..!
- అబుదాబిలో అక్రమంగా కార్ వాష్ చేస్తే Dh4,000 వరకు జరిమానా
- బహ్రెయిన్లో ఘోర అగ్నిప్రమాదం.. తల్లి, ముగ్గురు పిల్లలు మృతి
- షార్జాలో వాహన నంబర్ ప్లేట్ల సేకరణ సర్వీస్.. నూన్తో పోలీసుల భాగస్వామ్యం
- ఏపీ మున్సిపల్ పోరుకు సర్కార్ సిద్ధం..
- జెడ్డాలో ‘ఇండియా ఉత్సవ్’లో పాల్గొన్న కాన్సుల్ జనరల్ ఫహద్ సూరి







