ఆసియా క్రీడల సదస్సులో పాల్గొన్న బహ్రెయిన్ అధికారులు
- June 30, 2023
బహ్రెయిన్: చైనాలో సెప్టెంబర్ 23 నుండి అక్టోబర్ 8 వరకు జరగనున్న రాబోయే ఏషియాడ్ కోసం నిర్వహించిన సమావేశంలో హాంగ్జౌ ఆసియా క్రీడలకు బహ్రెయిన్ చెఫ్ డి మిషన్, అహ్మద్ అబ్దుల్గఫార్ పాల్గొన్నారు. వీరితో పాటు బహ్రెయిన్ ఒలింపిక్ కమిటీ ఫోటోగ్రాఫర్ అలీ అల్ హల్వాచి కూడా హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రతినిధుల రాక, హోటళ్లు, అథ్లెట్లు , మీడియా విలేజ్, పోషణ, రవాణా, స్టేడియంలు, ఇతర క్రీడా సౌకర్యాలు, ప్రారంభ - ముగింపు వేడుకలు మొదలైన వాటితో సహా ఆటల నిర్వహణకు సంబంధించిన అన్ని అంశాలపై చర్చించారు. క్రీడల సందర్భంగా ఈవెంట్లు మొత్తం 54 ప్రాంతాలలో నిర్వహించబడతాయి. మరో 31 శిక్షణ కోసం కేటాయించబడ్డాయి. అథ్లెట్లను రవాణా చేయడానికి డ్రైవర్లు లేకుండా స్మార్ట్ కార్లను వినియోగించనున్నారు. ప్రపంచం నలుమూలల నుండి దాదాపు 12,000 మంది మీడియా నిపుణులు ఈ క్రీడలను కవర్ చేస్తారని కూడా ప్రకటించారు. కాన్ఫరెన్స్ తర్వాత వివిధ క్రీడా సౌకర్యాలు, స్టేడియంలలో ఫీల్డ్ టూర్ నిర్వహించారు.
తాజా వార్తలు
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం









