శర్వానంద్,లావణ్య త్రిపాఠి కాంబినేషన్ తో 'జోడీ కుదిరింది' చిత్రం
- May 13, 2016
రన్రాజారన్, ఎక్స్ప్రెస్ రాజా చిత్రాలతో ఆకట్టుకొన్నాడు శర్వానంద్. భలేభలే మగాడివోయ్, సోగ్గాడే చిన్నినాయనా చిత్రాలతో విజయాలు అందుకొంది లావణ్య త్రిపాఠి. ఇప్పుడు వీళ్లిద్దరికీ జోడీ కుదిరింది. శర్వానంద్ కథానాయకుడిగా బివిఎస్ఎన్ ప్రసాద్ ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. చంద్రమోహన్ దర్శకుడు. కథానాయికగా లావణ్యని ఎంచుకొన్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ''మా సంస్థలో తెరకెక్కించిన 'డార్లింగ్' చిత్రానికి సహాయకుడిగా పచేసిన చంద్రమోహన్ చెప్పిన కథ బాగా నచ్చింది. అతన్ని ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం. జూన్ 1 నుంచి చిత్రీకరణ మొదలుపెడతాం. రతన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తారు. మిగిలిన వివరాలు త్వరలో ప్రకటిస్తామ''న్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: కార్తీక్ ఘట్టమనేని, సమర్పణ: భోగవల్లి బాపినీడు. కాంబినేషన్ తో
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







