శ్రీవారి భక్తులకు శుభవార్త..
- July 02, 2023
తిరుమల: తిరుమల శ్రీవారి భక్తులకు (TTD)టీటీడీ శుభవార్త తెలిపింది. స్థానిక ఆలయాలతోపాటు ఉప ఆలయాల్లోనూ యూపీఐ చెల్లింపులకు టీటీడీ తగిన ఏర్పాట్లు చేస్తోంది. సేవ టిక్కెట్లు, ప్రసాదాలు, అగరబత్తులు, పంచగవ్య ఉత్పత్తులు, డైరీలు, క్యాలెండర్లు కొనుగోలు చేసే భక్తుల సౌకర్యార్థం ఫోన్ పే, క్యూ ఆర్ కోడ్ స్కానర్ ద్వారా యూపీఐ, డెబిట్ కార్డు(ఆన్ లైన్) ద్వారా చెల్లించేందరుకు చర్యలు చేపట్టాలని జేఈవో వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు.
ఈ మేరకు ఆయన శనివారం ఆయా ఆలయాల అధికారులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వీరబ్రహ్మం మాట్లాడుతూ టీటీడీ అనుబంధ ఆలయాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఆయా ఆలయాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
టీటీడీ వెబ్ సైట్, ఎస్వీబీసీ, యాత్రికులు ఎక్కువగా సంచరించే రైల్వే స్టేషన్, బస్టాండ్ ఇతర ముఖ్యమైన ప్రాంతాల్లో టీటీడీ ఆలయాల గురించి తెలిసేలా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. స్థానిక ఆలయాల్లో కళ్యాణోత్సవంతోపాటు ఇతర ఆర్జితసేవలు ప్రారంభించేందుకు గల అవకాశాలను పరిశీలించి సమగ్ర నివేదిక అందించాలని ఆదేశించారు.
ఆలయాల్లో పచ్చదనం-పరిశుభ్రతలో భాగంగా భక్తులకు మరింత ఆధ్యాత్మిక, ఆహ్లాదకరమైన వాతావరణం కోసం మొక్కలు పెంచాలని డీఎఫ్ వోను ఆదేశించారు. అన్ని ఆలయాల్లో పారిశుధ్యానికి పెద్దపేట వేయాలని అధికారులను సూచించారు. ఆలయాల్లో యూపీఏ చెల్లింపుల ఏర్పాటుపై భక్తులు హర్షం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ఉమ్రా వీసాల జారీ నిలిపివేత..మక్కా ప్రవేశం పై ఆంక్షలు..!!
- రిటైల్ పేమెంట్స్.. 85% వాటా ఈ-చెల్లింపులదే..!!
- అక్షయ తృతీయకు ముందు దుబాయ్లో తగ్గిన బంగారం ధరలు..!!
- తాజా పరిణామాల పై సుల్లాన్, యూకే పీఎం చర్చలు..!!
- ప్రైవేట్ సంస్థల్లో క్లాస్ రూమ్ లెర్నింగ్ తిరిగి ప్రారంభం..!!
- కువైట్ పౌరసత్వ చట్టానికి సవరణలు..గెజిట్లో పబ్లిష్..!!
- హెన్లీ గ్లోబల్ ర్యాంకింగ్స్..ఖతార్ పాస్పోర్ట్ ముందంజ..!!
- తిరుమల లగేజీ కౌంటర్ సేవలు పూర్తిగా ఉచితం: టీటీడీ ప్రకటన
- మహిళా రిజర్వేషన్ బిల్లుతో సరికొత్త చరిత్ర: ప్రధాని మోదీ
- ‘మళ్లీ టీఆర్ఎస్గా’..! కేటీఆర్ కీలక వ్యాఖ్యలు









