పిల్లల పాస్పోర్ట్లను స్టాంపింగ్ కొసం ప్రత్యేక ఏర్పాట్లు
- July 02, 2023
దుబాయ్: దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు చేరుకున్న పిల్లలకు సేలం, సలామా అలాగే దుబాయ్ సమ్మర్ సర్ప్రైజెస్తో సంబంధం ఉన్న మస్కట్లుగా ఉన్న మోడేష్, డానాలతో సహా ప్రసిద్ధ స్థానిక కార్టూన్ పాత్రల బృందం సాదరంగా స్వాగతం పలికింది. పిల్లలను విమానం డోర్ నుండి ఎస్కార్ట్ చేసి, పాస్పోర్ట్ కౌంటర్ల వద్దకు తీసుకెళ్లారు. అక్కడ వారి పాస్పోర్ట్లను తామే స్టాంప్ చేసే ఏకైక అవకాశం కల్పించారు. కార్టూన్ పాత్రలతో పాటు ఫోటోగ్రాఫ్లు మరియు వీడియోలకు పోజులివ్వడంతో వారికి చిరు హుమతులను అందజేశారు. ఈద్ అల్ అదా సందర్భంగా సంతోషకరమైన వాతావరణాన్ని పెంపొందించడానికి కొనసాగుతున్న ప్రయత్నాలలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినట్టు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ (GDRFA) తెలిపింది. పిల్లల కోసం ఈ ప్రత్యేక షాపింగ్ ఫెస్టివల్ కొనసాగుతుందని, ఇది దుబాయ్ వారసత్వంలో అంతర్భాగంగా ఉన్నందున సందర్శకులందరికీ ఆతిథ్యాన్ని అందించడం తమ బాధ్యతని GDRFA డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ మహ్మద్ అహ్మద్ అల్ మర్రి తెలిపారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో ADNOC నౌకపై దాడిని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- తెలంగాణ, ఏపీ మీదుగా మరో 2 అమృత్ భారత్ రైళ్లు!
- భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ముర్ముకు యూఏఈ నేతల శుభాకాంక్షలు
- భార్య అనుకుని మరో మహిళపై దాడి.. షార్జాలో వ్యక్తిపై కేసు..!!
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు విజ్ఞప్తి
- కువైట్లో ఘనంగా భారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!
- బహ్రెయిన్కు భారత్ అండగా ఉంటుంది.. జైశంకర్ పర్యటనతో భరోసా..!!
- అల్ సాద్ మెట్రో స్టేషన్లో ఆకట్టుకుంటున్న ఆర్టిస్టిక్ మ్యూరల్స్..!!
- భారత్@80.. సౌదీ అరేబియాతో మరింత బలపడుతున్న భాగస్వామ్యం..!!
- మస్కట్లో ఘనంగా భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!







