భద్రతా సిబ్బందిపై కాల్పులు. నిందితులు అరెస్ట్
- July 03, 2023
సౌదీ: అల్-కున్ఫుదా గవర్నరేట్లో యాంఫెటమైన్ డ్రగ్ విక్రయాలు జరుపుతున్నారని సమాచారం మేరకు దాడులు చేసిన భద్రతా సిబ్బందిపై నిందితులు కాల్పులు జరిపారు. భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులు జరిపారు. కాగా, ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని పోలీసులు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేశామని, వారి వద్ద ఉన్న మారణాయుధాలు, నగదును స్వాధీనం చేసుకున్నట్లు భద్రతా సిబ్బంది తెలిపారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు వీలుగా వారిని కాంపిటెంట్ అథారిటీకి రిఫర్ చేశామన్నారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా లేదా ప్రమోషన్కు సంబంధించిన ఏదైనా కార్యకలాపాల గురించి ఏదైనా సమాచారం ఉంటే వెంటనే తెలియజేయాలని భద్రతా అధికారులు సౌదీ పౌరులందరికీ, అలాగే నివాసితులను కోరారు. మక్కా, రియాద్ మరియు తూర్పు ప్రావిన్స్లోని ప్రాంతాలలో 911 నంబర్లను సంప్రదించడం ద్వారా ఈ నేరాలను నివేదించవచ్చని, మిగిలిన ప్రాంతాలలో 999 ద్వారా కాల్ చేయాలన్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో ADNOC నౌకపై దాడిని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- తెలంగాణ, ఏపీ మీదుగా మరో 2 అమృత్ భారత్ రైళ్లు!
- భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ముర్ముకు యూఏఈ నేతల శుభాకాంక్షలు
- భార్య అనుకుని మరో మహిళపై దాడి.. షార్జాలో వ్యక్తిపై కేసు..!!
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు విజ్ఞప్తి
- కువైట్లో ఘనంగా భారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!
- బహ్రెయిన్కు భారత్ అండగా ఉంటుంది.. జైశంకర్ పర్యటనతో భరోసా..!!
- అల్ సాద్ మెట్రో స్టేషన్లో ఆకట్టుకుంటున్న ఆర్టిస్టిక్ మ్యూరల్స్..!!
- భారత్@80.. సౌదీ అరేబియాతో మరింత బలపడుతున్న భాగస్వామ్యం..!!
- మస్కట్లో ఘనంగా భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!







