ఇన్స్ట్రాగ్రామ్లోకి ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్
- July 04, 2023
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇన్స్ట్రాగ్రామ్లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం పవన్ ఓ పక్క సినిమాలు చేస్తూనే..మరోపక్క రాజకీయాలతో బిజీ గా ఉన్నారు. మరో ఐదు , ఆరు నెలల్లో ఏపీలో ఎన్నికలు రాబోతుండడం తో ప్రజలకు మరింత దగ్గ్గర అయ్యేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాడు. రీసెంట్ గా ఉభయ గోదావరి జిల్లాలో రెండు వారాలపాటు వారాహి విజయయాత్ర చేపట్టారు. ఈ యాత్ర కు ప్రజలు బ్రహ్మ రధం పట్టారు.
కొంతకాలం నుండి ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉంటూ సినిమాలకు సంబదించిన విషయాలు, రాజకీయ విషయాలు షేర్ చేస్తూ వస్తున్నాడు. ట్విట్టర్లో పవన్కు 5.3 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా పవన్ ఇన్స్టాగ్రామ్లోకి అడుగుపెట్టాడు. ఇలా అకౌంట్ ఓపెన్ చేశాడో లేదో లక్షల్లో ఫాలోవర్స్ వచ్చి చేరుతున్నారు. అభిమానులు, కార్యకర్తలకు నిత్యం టచ్లో ఉండాలని భావిస్తున్న నేపథ్యంలో ఇన్స్టాలోకి పవన్ అడుగుపెట్టాడట. ప్రస్తుతం పవన్ వరుస సినిమాలతో తెగ బిజీగా ఉన్నాడు.
పవన్ చేతిలో ఇప్పుడు నాలుగు సినిమాలున్నాయి. అందులో బ్రో మరో నాలుగు వారాల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే రిలీజైన టీజర్కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీనితో పాటుగా సుజీత్తో ఓజీ, హరీష్ శంకర్తో ఉస్తాద్ భగత్సింగ్ చేస్తున్నాడు. ఇక క్రిష్తో పాన్ ఇండియా సినిమా హరిహర వీరమల్లు చేస్తున్నాడు.
తాజా వార్తలు
- ఉమ్రా వీసాల జారీ నిలిపివేత..మక్కా ప్రవేశం పై ఆంక్షలు..!!
- రిటైల్ పేమెంట్స్.. 85% వాటా ఈ-చెల్లింపులదే..!!
- అక్షయ తృతీయకు ముందు దుబాయ్లో తగ్గిన బంగారం ధరలు..!!
- తాజా పరిణామాల పై సుల్లాన్, యూకే పీఎం చర్చలు..!!
- ప్రైవేట్ సంస్థల్లో క్లాస్ రూమ్ లెర్నింగ్ తిరిగి ప్రారంభం..!!
- కువైట్ పౌరసత్వ చట్టానికి సవరణలు..గెజిట్లో పబ్లిష్..!!
- హెన్లీ గ్లోబల్ ర్యాంకింగ్స్..ఖతార్ పాస్పోర్ట్ ముందంజ..!!
- తిరుమల లగేజీ కౌంటర్ సేవలు పూర్తిగా ఉచితం: టీటీడీ ప్రకటన
- మహిళా రిజర్వేషన్ బిల్లుతో సరికొత్త చరిత్ర: ప్రధాని మోదీ
- ‘మళ్లీ టీఆర్ఎస్గా’..! కేటీఆర్ కీలక వ్యాఖ్యలు









