బహ్రెయిన్ లో గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఫోరమ్, ఎగ్జిబిషన్
- July 04, 2023
బహ్రెయిన్: క్రౌన్ ప్రిన్స్, సాయుధ దళాల డిప్యూటీ సుప్రీం కమాండర్ మరియు ప్రధాన మంత్రి అయిన హిస్ రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా ఆధ్వర్యంలో అంతర్జాతీయ సైబర్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్, ఎగ్జిబిషన్ రెండవ ఎడిషన్కు బహ్రెయిన్ ఆతిథ్యం ఇవ్వనుంది. రెండు రోజుల ఈవెంట్ డిసెంబర్ 5 న ఎగ్జిబిషన్ వరల్డ్ బహ్రెయిన్లో ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా జాతీయ భద్రతా సలహాదారు, రాయల్ గార్డ్ కమాండర్, లెఫ్టినెంట్ జనరల్ హిస్ హైనెస్ షేక్ నాసర్ బిన్ హమద్ అల్ ఖలీఫా ఒక ప్రకటనను విడుదల చేశారు. జాతీయ భద్రత మరియు ఆర్థిక అభివృద్ధికి మూలస్తంభంగా సైబర్ భద్రత ప్రాముఖ్యతను అందులో వివరించారు. "బహ్రెయిన్ భద్రత, శ్రేయస్సు సురక్షితమైన ICT మౌలిక సదుపాయాలపై ఆధారపడి ఉంటుంది" అని లెఫ్టినెంట్ జనరల్ చెప్పారు. రాబోయే కాన్ఫరెన్స్ మరియు ఎగ్జిబిషన్ జాతీయ సైబర్ సెక్యూరిటీ స్ట్రాటజీకి అనుగుణంగా ఉన్నాయని, కొత్త టెక్నాలజీని అన్వేషించడం, గ్లోబల్ సైబర్స్పేస్ అభివృద్ధిని నేర్చుకోవడం, వ్యవహరించడం లక్ష్యంగా ఉన్నాయని షేక్ నాజర్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఏఐ ప్రభావం షాకింగ్, ఉద్యోగాలకు భారీ ముప్పు?
- Bangladesh: తారిక్ రెహమాన్ ప్రధాని కావడం భారత్కు ప్రయోజనమా?
- బంపర్ ఆఫర్ ప్రకటించిన ప్రముఖ రియల్టీ సంస్థ అన్విత గ్రూప్
- ఏపీ బడ్జెట్ 2026-27: దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం
- అంతర్జాతీయ మాదకద్రవ్య ముఠాను ఛేదించిన యూఏఈ, కువైట్..!!
- కువైట్ ఎంబసీలో నేషనల్, లిబరేషన్ డే సెలబ్రేషన్స్..!!
- GCC లో పనిచేసే బహ్రెయిన్లకు నిరుద్యోగ బీమా..!!
- ఖసాబ్ లో భూకంపం వివరాలు వెల్లడి..!!
- ఖతార్ లో రెండు రోజులపాటు స్ట్రాంగ్ విండ్స్..!!
- గాజా సంక్షోభం .. గ్లోబల్ వైఫల్యం: సౌదీ FM









