మెగా డబుల్ ధమాకా.! ఒకే స్క్రీన్ పై అన్నదమ్ములిద్దరూ.!
- July 05, 2023
మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి ఒకే స్క్రీన్ పై కనిపిస్తే ఎలా వుంటుంది.? గతంలో ‘శంకర్ దాదా జిందాబాద్’ సినిమాలో ఈ కాంబోని కొన్ని సెకన్ల పాటు స్క్రీన్ పై చూశాం. ఆ తర్వాత మళ్లీ ఆ అవకాశం కోసం ఎంత ప్రయత్నించినా ఇంతవరకూ జరగలేదు.
కానీ, ఇప్పుడు అందుకు అవకాశమొచ్చిందా.? అంటే ఒకింత అవుననే చెప్పాలి. ఒకే స్క్రీన్ పై ఈ ఇద్దరూ కనిపించే అవకశాశముంది. అయితే, ఇక్కడే చిన్న ట్విస్ట్. ఒకే స్క్రీన్ పై కనిపిస్తారు. కానీ, కలిసి కాదు. ఏంటా ట్విస్ట్ అనుకుంటున్నారా.?
ఈ నెల 28న ‘బ్రో’ మూవీ రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఇదే రోజు, ఈ సినిమా రిలీజ్ కాబోయే ధియేటర్లలోనే మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ సినిమా ట్రైలర్ని రిలీజ్ చేయనున్నారు.
అలా ఈ ఇద్దరూ ఒకే స్క్రీన్పై కనిపించబోతున్నారు. ఒకే ధియేటర్లో ఇద్దరు అభిమాన హీరోల్ని ఒకేసారి చూసే అవకాశం.. మెగా అభిమానులకు ఇది నిజమైన పండగే కదా. మెగా డబుల్ ట్రీట్ అంటే ఇదే మరి.
తాజా వార్తలు
- JEE మెయిన్ 2026 ఫైనల్ కీ విడుదల
- వాణిజ్య ఒప్పందాలతో కొత్త ఆర్థిక యుగం
- బిల్ గేట్స్కు సీఎం చంద్రబాబు ఆత్మీయ స్వాగతం
- భారత్ పై OpenAI సీఈవో సామ్ అల్ట్మన్ ప్రశంసలు
- డేటా సెంటర్లతో భారీ ఉపాధి: ప్రధాని మోదీ
- దోహాలో ఖతార్ రోబోటిక్స్ AI కాంపిటీషన్ ప్రారంభం..!!
- బహ్రెయిన్ - దమ్మామ్ మధ్య హెలికాప్టర్ సర్వీస్..!!
- ‘సహ్ల్’ యాప్ లో సాలరీ డిడక్షన్ నోటిఫికేషన్..!!
- ఒమన్లో వరుస నేరాలు..పలువురు అరెస్టు..!!
- సౌదీ అరేబియాలో స్కూల్స్ టైమింగ్స్ ఛేంజ్..!!









