వర్షాకాలంలో ఆస్తమా రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.!
- July 06, 2023
వర్షా కాలం వస్తుందంటే చాలు.. అనేక రకాల రోగాలు చుట్టుముడుతుంటాయ్. చిటపట చినుకులు తొలకరితో పాటూ, రోగాల్నీ మోసుకొస్తాయ్. సీజనల్గా వచ్చే ఈ రోగాల్లో ముఖ్యంగా ఆస్తమా రోగులు అత్యంత జాగ్రత్తలు తీసుకోవల్సిన ఆవశ్యకత వుంది.
ఆస్తమా రోగులు ఈ కాలంలో వచ్చే జలుబును అస్సలు అశ్రద్ధ చేయకూడదు. ముందస్తు జాగ్రత్తలు పాఠించాలి.
ముఖ్యంగా తాగే నీటి విషయంలో చాలా జాగ్రత్తగా వుండాలి. చల్లని పానీయాలకు పూర్తిగా దూరంగా వుండాలి.
కాచి చల్లార్చిన నీటినే తీసుకోవడం మంచిది. అలాగే శుభ్రమైన అలెర్జీ ఫ్రీ ఎట్మాస్పియర్ని క్రియేట్ చేసుకోవాలి.
ఇండోర్లో తేమ వాతావరణం ఎక్కువగా లేకుండా చూసుకోవాలి. అలాగే వెంటిలేషన్ కూడా. అలాగే బూజు, అపరిశుభ్రమైన వాతావరణానికి దూరంగా వుంటే మంచిది.
పోషక విలువలున్న ఆహారాన్ని, ఆకుకూరలను ఎక్కవగా తమ ఆహారంలో చేర్చుకోవడం మంచిది. వేడి వేడిగా వున్న ఆహారాన్ని తింటే మంచిది. పరిసరాల పరిశుభ్రతతో పాటూ, వ్యక్తిగత పరిశుభ్రత కూడా చాలా చాలా అవసరం.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







