అధికారిక పత్రాలు ఫోర్జరీ.. 33మంది ఫిలిప్పీన్స్ ముఠా అరెస్ట్
- July 08, 2023
కువైట్: దేశంలోని ఫిలిప్పీన్స్ కమ్యూనిటీ కోసం అధికారిక పత్రాలను ఫోర్జరీ చేస్తున్న ముఠాను అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అరెస్ట్ చేసింది. దేశంలోని చట్టాలను ఉల్లంఘించేవారిని అరికట్టడానికి డిప్యూటీ ప్రధాని, అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ తలాల్ ఖలీద్ అల్-అహ్మద్ అల్-సబా మార్గదర్శకాల మేరకు ఫోర్జరీ ముఠాను పట్టుకున్నట్లు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కమ్యూనిటీ సభ్యుల కోసం స్టడీ సర్టిఫికెట్లు, వివాహ ఒప్పందాలు, డ్రైవింగ్ పర్మిట్లు వంటి మోసపూరిత పత్రాలను జారీ చేసిన 33 మంది ఫిలిపినోలను పట్టుకోవడంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఫిలిప్పీన్స్ రాయబార కార్యాలయం సహకారం అందించాయని పేర్కొన్నారు. వారిపై తదుపరి చట్టపరమైన ప్రక్రియల కోసం సంబంధిత అధికారులకు రిఫర్ చేసినట్టు తెలిపారు.
తాజా వార్తలు
- ‘మళ్లీ టీఆర్ఎస్గా’..! కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
- 'మార్గం మార్చుకోండి, వెనక్కి వెళ్ళండి': అమెరికాకు ఇరాన్ హెచ్చరిక
- ఉపదేశామృత తరంగిణి పుస్తకాన్ని ఆవిష్కరించిన వెంకయ్యనాయుడు
- టెహ్రాన్లో గాంధీ ఆసుపత్రి ధ్వంసం!
- హోర్ముజ్ జలసంధిని అందరికీ తెరవాలని ఆస్ట్రేలియా పిలుపు
- ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్ కాల్తో శాంతి చర్చలు భంగం
- అడ్మిషన్ల ప్రక్రియలో ఖతార్ మార్పులు..!!
- ఫిబ్రవరిలో SR 12.5 బిలియన్లకు తగ్గిన రెమిటెన్స్..!!
- అనుమతి రాగానే T5 కార్యకలాపాలను పునఃప్రారంభిస్తాం..జజీరా ఎయిర్వేస్
- ఆన్లైన్ లేదా తరగతి గది బోధన..ఛాయిస్ మీదే..!!









