అధికారిక పత్రాలు ఫోర్జరీ.. 33మంది ఫిలిప్పీన్స్ ముఠా అరెస్ట్
- July 08, 2023
కువైట్: దేశంలోని ఫిలిప్పీన్స్ కమ్యూనిటీ కోసం అధికారిక పత్రాలను ఫోర్జరీ చేస్తున్న ముఠాను అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అరెస్ట్ చేసింది. దేశంలోని చట్టాలను ఉల్లంఘించేవారిని అరికట్టడానికి డిప్యూటీ ప్రధాని, అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ తలాల్ ఖలీద్ అల్-అహ్మద్ అల్-సబా మార్గదర్శకాల మేరకు ఫోర్జరీ ముఠాను పట్టుకున్నట్లు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కమ్యూనిటీ సభ్యుల కోసం స్టడీ సర్టిఫికెట్లు, వివాహ ఒప్పందాలు, డ్రైవింగ్ పర్మిట్లు వంటి మోసపూరిత పత్రాలను జారీ చేసిన 33 మంది ఫిలిపినోలను పట్టుకోవడంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఫిలిప్పీన్స్ రాయబార కార్యాలయం సహకారం అందించాయని పేర్కొన్నారు. వారిపై తదుపరి చట్టపరమైన ప్రక్రియల కోసం సంబంధిత అధికారులకు రిఫర్ చేసినట్టు తెలిపారు.
తాజా వార్తలు
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు
- నకిలీ సమ్మర్ ట్రావెల్ ఆఫర్ల పై అప్రమత్తంగా ఉండండి..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ట్యాక్స్ పెనాల్టీ మాఫీ పథకాన్ని పొడిగించిన సౌదీ అరేబియా..!!
- యునెస్కోలో సుల్తాన్ హైథమ్ చారిత్రక ప్రసంగం..!!
- రాయల్ యూనివర్శిటీ ఫర్ విమెన్ లో ఘనంగా 18వ స్నాతకోత్సవం..!!
- పాస్పోర్ట్, కాన్సులర్ సేవల రుసుములను సవరించిన ఎంబసీ..!!
- జూలై నెల పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- మే నెలలో QR1.73 బిలియన్ల విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలు..!!
- తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్!







