పౌరులకు 3,200 ల్యాండ్ ప్లాట్లు కేటాయింపు
- July 10, 2023
దుబాయ్: దుబాయ్లోని ఎమిరాటీ పౌరులకు 3,200 ల్యాండ్ ప్లాట్లను దుబాయ్ మునిసిపాలిటీ కేటాయించింది. పౌరులకు అత్యున్నత నాణ్యమైన జీవితాన్ని అందించాలనే దుబాయ్ పాలకుల దృష్టిలో భాగంగా, ఈ రెసిడెన్షియల్ ప్లాట్లను ప్రకటించినట్టు దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ట్విటర్లో పేర్కొన్నారు. ఇది ఎమిరాటీ పౌరులకు సరియైన జీవన ప్రమాణాలను పెంపొందించడానికి యూఏఈ ఉపాధ్యక్షుడు, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ యొక్క దార్శనికత అమలు చేయడంలో భాగంగా ప్లాట్లను పంపిణీ చేసినట్లు వివరించారు. ల్యాండ్ ప్లాట్ల కేటాయింపు దుబాయ్లోని హయ్యర్ కమిటీ ఫర్ డెవలప్మెంట్ అండ్ సిటిజన్స్ అఫైర్స్ సమగ్ర సిటిజన్ హౌసింగ్ ప్లాన్ల ప్రకారం అమలు చేయబడుతుందని, దుబాయ్ 2040 అర్బన్ మాస్టర్ ప్లాన్కు మద్దతు ఇస్తుందన్నారు. ఇది దుబాయ్లో స్థిరమైన పట్టణ అభివృద్ధిని సాధించడం, దుబాయ్ మరియు దానిలో జీవన నాణ్యతను, పోటీతత్వాన్ని పెంచుతుందని అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు
- నకిలీ సమ్మర్ ట్రావెల్ ఆఫర్ల పై అప్రమత్తంగా ఉండండి..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ట్యాక్స్ పెనాల్టీ మాఫీ పథకాన్ని పొడిగించిన సౌదీ అరేబియా..!!
- యునెస్కోలో సుల్తాన్ హైథమ్ చారిత్రక ప్రసంగం..!!
- రాయల్ యూనివర్శిటీ ఫర్ విమెన్ లో ఘనంగా 18వ స్నాతకోత్సవం..!!
- పాస్పోర్ట్, కాన్సులర్ సేవల రుసుములను సవరించిన ఎంబసీ..!!
- జూలై నెల పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- మే నెలలో QR1.73 బిలియన్ల విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలు..!!
- తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్!







