పౌరులకు 3,200 ల్యాండ్ ప్లాట్లు కేటాయింపు
- July 10, 2023
దుబాయ్: దుబాయ్లోని ఎమిరాటీ పౌరులకు 3,200 ల్యాండ్ ప్లాట్లను దుబాయ్ మునిసిపాలిటీ కేటాయించింది. పౌరులకు అత్యున్నత నాణ్యమైన జీవితాన్ని అందించాలనే దుబాయ్ పాలకుల దృష్టిలో భాగంగా, ఈ రెసిడెన్షియల్ ప్లాట్లను ప్రకటించినట్టు దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ట్విటర్లో పేర్కొన్నారు. ఇది ఎమిరాటీ పౌరులకు సరియైన జీవన ప్రమాణాలను పెంపొందించడానికి యూఏఈ ఉపాధ్యక్షుడు, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ యొక్క దార్శనికత అమలు చేయడంలో భాగంగా ప్లాట్లను పంపిణీ చేసినట్లు వివరించారు. ల్యాండ్ ప్లాట్ల కేటాయింపు దుబాయ్లోని హయ్యర్ కమిటీ ఫర్ డెవలప్మెంట్ అండ్ సిటిజన్స్ అఫైర్స్ సమగ్ర సిటిజన్ హౌసింగ్ ప్లాన్ల ప్రకారం అమలు చేయబడుతుందని, దుబాయ్ 2040 అర్బన్ మాస్టర్ ప్లాన్కు మద్దతు ఇస్తుందన్నారు. ఇది దుబాయ్లో స్థిరమైన పట్టణ అభివృద్ధిని సాధించడం, దుబాయ్ మరియు దానిలో జీవన నాణ్యతను, పోటీతత్వాన్ని పెంచుతుందని అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







