పౌరులకు 3,200 ల్యాండ్ ప్లాట్లు కేటాయింపు
- July 10, 2023
దుబాయ్: దుబాయ్లోని ఎమిరాటీ పౌరులకు 3,200 ల్యాండ్ ప్లాట్లను దుబాయ్ మునిసిపాలిటీ కేటాయించింది. పౌరులకు అత్యున్నత నాణ్యమైన జీవితాన్ని అందించాలనే దుబాయ్ పాలకుల దృష్టిలో భాగంగా, ఈ రెసిడెన్షియల్ ప్లాట్లను ప్రకటించినట్టు దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ట్విటర్లో పేర్కొన్నారు. ఇది ఎమిరాటీ పౌరులకు సరియైన జీవన ప్రమాణాలను పెంపొందించడానికి యూఏఈ ఉపాధ్యక్షుడు, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ యొక్క దార్శనికత అమలు చేయడంలో భాగంగా ప్లాట్లను పంపిణీ చేసినట్లు వివరించారు. ల్యాండ్ ప్లాట్ల కేటాయింపు దుబాయ్లోని హయ్యర్ కమిటీ ఫర్ డెవలప్మెంట్ అండ్ సిటిజన్స్ అఫైర్స్ సమగ్ర సిటిజన్ హౌసింగ్ ప్లాన్ల ప్రకారం అమలు చేయబడుతుందని, దుబాయ్ 2040 అర్బన్ మాస్టర్ ప్లాన్కు మద్దతు ఇస్తుందన్నారు. ఇది దుబాయ్లో స్థిరమైన పట్టణ అభివృద్ధిని సాధించడం, దుబాయ్ మరియు దానిలో జీవన నాణ్యతను, పోటీతత్వాన్ని పెంచుతుందని అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- ‘మళ్లీ టీఆర్ఎస్గా’..! కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
- 'మార్గం మార్చుకోండి, వెనక్కి వెళ్ళండి': అమెరికాకు ఇరాన్ హెచ్చరిక
- ఉపదేశామృత తరంగిణి పుస్తకాన్ని ఆవిష్కరించిన వెంకయ్యనాయుడు
- టెహ్రాన్లో గాంధీ ఆసుపత్రి ధ్వంసం!
- హోర్ముజ్ జలసంధిని అందరికీ తెరవాలని ఆస్ట్రేలియా పిలుపు
- ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్ కాల్తో శాంతి చర్చలు భంగం
- అడ్మిషన్ల ప్రక్రియలో ఖతార్ మార్పులు..!!
- ఫిబ్రవరిలో SR 12.5 బిలియన్లకు తగ్గిన రెమిటెన్స్..!!
- అనుమతి రాగానే T5 కార్యకలాపాలను పునఃప్రారంభిస్తాం..జజీరా ఎయిర్వేస్
- ఆన్లైన్ లేదా తరగతి గది బోధన..ఛాయిస్ మీదే..!!









