మొన్న పూజా హెగ్ధే ఇప్పుడు రష్మిక.!
- July 13, 2023
నితిన్కి రష్మిక హ్యాండిచ్చేసిందట. ఏంటిదంతా.? అనుకుంటున్నారా.? నితిన్, రష్మిక జంటగా ఓ ప్రాజెక్ట్ అనౌన్స్ అయ్యింది. పూజా కార్యక్రమాలతో ఎప్పుడో ఈ సినిమా స్టార్ట్ అయ్యింది. ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల ఈ సినిమాకి దర్శకుడు.
కాగా, రష్మిక ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందంటూ తాజాగా ప్రచారం జోరందుకుంది. ఇటీవల ‘గుంటూరు కారం’ సినిమా నుంచి పూజా హెగ్ధే కూడా ఇలాగే తప్పుకుంది. అందుకు పూజా చెప్పిన కారణం బాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీగా వుండడం. డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోవడమే.
సేమ్ రీజన్ ఇప్పుడు రష్మిక సన్నిహితుల నుంచి కూడా వినిపిస్తుండడం విశేషం. రష్మిక కూడా ప్రస్తుతం బాలీవుడ్లో తెగ బిజీ అయిపోయింది. ఈ నేపథ్యంలోనే నితిన్కి హ్యాండిచ్చిందంటూ ప్రచారం జరుగుతోంది.
‘VNRTrio’ అంటూ ఈ కాంబోని సూపర్ హిట్ కాంబోగా పిలుస్తున్నారు. రష్మిక తొలి సినిమా ‘ఛలో’ని డైరెక్ట్ చేసింది వెంకీ కుడుముల. ఆ తర్వాత నితిన్తో ‘భీష్మ’ సినిమా తెరకెక్కించాడు. రష్మికను హీరోయిన్గా తీసుకున్నాడు. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. అదే సెంటిమెంట్తో ముచ్చటగా మూడో సినిమాలోనూ రష్మికనే ఎంచుకున్నాడు వెంకీ కుడుముల.
అయితే, రష్మిక ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందన్న ప్రచారంలో నిజమెంతో కానీ, ఇలా హీరోయిన్లు సడెన్గా హీరోలకు హ్యాండిచ్చేయడం మాత్రం కాస్త ఆలోచించాల్సిన అంశమే.
తాజా వార్తలు
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు
- నకిలీ సమ్మర్ ట్రావెల్ ఆఫర్ల పై అప్రమత్తంగా ఉండండి..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ట్యాక్స్ పెనాల్టీ మాఫీ పథకాన్ని పొడిగించిన సౌదీ అరేబియా..!!
- యునెస్కోలో సుల్తాన్ హైథమ్ చారిత్రక ప్రసంగం..!!
- రాయల్ యూనివర్శిటీ ఫర్ విమెన్ లో ఘనంగా 18వ స్నాతకోత్సవం..!!
- పాస్పోర్ట్, కాన్సులర్ సేవల రుసుములను సవరించిన ఎంబసీ..!!
- జూలై నెల పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- మే నెలలో QR1.73 బిలియన్ల విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలు..!!
- తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్!







