ఢిల్లీలో ఆదివారం వరకు విద్యాసంస్థలు బంద్..
- July 13, 2023
న్యూ ఢిల్లీ: పది రోజులుగా ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు బీబత్సం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. వరదలకు వందల ఇల్లులు , బ్రిడ్జ్ లు కొట్టుకపోగా, కోట్లాది నష్టం వాటిల్లింది. ముఖ్యంగా యమునా నది మహోగ్ర రూపం దాల్చడంతో ఢిల్లీకి వరద ముప్పు ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలు ఆదివారం వరకు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు వర్క్ ఫ్రమ్ హోం విదానాన్ని పాటించాలని సూచించారు. అంతే కాదు రెండు రోజుల పాటు ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో నీటి సరఫ బంద్ కానున్నట్లు సర్కార్ తెలిపింది. ఢిల్లీలోకి వచ్చే భారీ ట్రక్కులపై నిషేధం విధించామని కేవలం అత్యవసర సర్వీసులను మాత్రమే అనుమతిస్తామని తెలిపారు. ఢిల్లీ వాసులు ఓపికతో ఉండాలని ఒక్కసారి వరద ప్రవాహం తగ్గితే అన్ని పరిస్థితులు సాధారణం అవుతాయని పేర్కొన్నారు.
హర్యానా సహా పొరుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో యమునా నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. 2 కోట్ల జనాభా ఉన్న ఢిల్లీలో గత కొన్ని రోజులుగా భారీ వానలను చవిచూస్తున్నాయని.. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయని పేర్కొన్నారు. వేలాది మంది ప్రజలను తాత్కాలికంగా ఏర్పాటు చేసిన సహాయక కేంద్రాలకు తరలించినట్లు తెలిపారు. గురువారం వరకు యమునా నదిలో ప్రవాహం అధికంగా ఉంటుందని.. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి మరింత మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు.
తాజా వార్తలు
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు







