ఫ్రాన్స్ చేరుకున్న ప్రధాని మోదీ
- July 13, 2023
పారిస్: రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం ఫ్రాన్స్ చేరుకున్నారు. ఫ్రాన్స్ రాజధాని ప్యారీస్లో అడుగుపెట్టిన ఆయనకు రెడ్ కార్పెట్ స్వాగతం పలికారు. ఫ్రాన్స్ ప్రధాని ఎలిజబెత్ బార్న్ స్వయం విమానాశ్రయానికి వచ్చి మోదీకి స్వాగతం పలికారు. తాను ఫ్రాన్స్ చేరుకున్నట్లుమోదీ ట్వీట్ ద్వారా తెలిపారు. అక్కడ విమానాశ్రయంలో దిగుతున్న ఫొటోలు, ఆయనకు గౌరవ వందనం ఇచ్చిన ఫొటోలను ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు.
ఇక శుక్రవారం జరగనున్న ఫ్రాన్స్ బస్టీల్ డే వేడుకల్లో గౌరవ అతిథిగా ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించే మిలటరీ పరేడ్లో ఫ్రాన్స్ దేశ బలగాలతో కలిసి భారత దళాలు కూడా పాల్గొనబోతున్నాయి. రక్షణ, అంతరిక్ష, మౌలిక, సాంస్కృతిక రంగాలతోపాటు వివిధ విభాగాల్లో భారత్-ఫ్రాన్స్ బంధాల బలోపేతమే లక్ష్యంగా ఆ దేశ ప్రెసిడెంట్ ఇమ్మానుయేల్ మాక్రాన్తో విస్తృతస్థాయి చర్చలు జరపనున్నారు. దీనికి సంబంధించి రెండు నెలల క్రితమే మెక్రాన్ ఆహ్వానం పలికారు.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









