ఫ్రాన్స్ చేరుకున్న ప్రధాని మోదీ
- July 13, 2023
పారిస్: రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం ఫ్రాన్స్ చేరుకున్నారు. ఫ్రాన్స్ రాజధాని ప్యారీస్లో అడుగుపెట్టిన ఆయనకు రెడ్ కార్పెట్ స్వాగతం పలికారు. ఫ్రాన్స్ ప్రధాని ఎలిజబెత్ బార్న్ స్వయం విమానాశ్రయానికి వచ్చి మోదీకి స్వాగతం పలికారు. తాను ఫ్రాన్స్ చేరుకున్నట్లుమోదీ ట్వీట్ ద్వారా తెలిపారు. అక్కడ విమానాశ్రయంలో దిగుతున్న ఫొటోలు, ఆయనకు గౌరవ వందనం ఇచ్చిన ఫొటోలను ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు.
ఇక శుక్రవారం జరగనున్న ఫ్రాన్స్ బస్టీల్ డే వేడుకల్లో గౌరవ అతిథిగా ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించే మిలటరీ పరేడ్లో ఫ్రాన్స్ దేశ బలగాలతో కలిసి భారత దళాలు కూడా పాల్గొనబోతున్నాయి. రక్షణ, అంతరిక్ష, మౌలిక, సాంస్కృతిక రంగాలతోపాటు వివిధ విభాగాల్లో భారత్-ఫ్రాన్స్ బంధాల బలోపేతమే లక్ష్యంగా ఆ దేశ ప్రెసిడెంట్ ఇమ్మానుయేల్ మాక్రాన్తో విస్తృతస్థాయి చర్చలు జరపనున్నారు. దీనికి సంబంధించి రెండు నెలల క్రితమే మెక్రాన్ ఆహ్వానం పలికారు.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







