భూగర్భ గదిలో దాచిన 1.8 మిలియన్ యాంఫెటమైన్ మాత్రలు స్వాధీనం
- July 14, 2023
సకాకా: అల్-జౌఫ్ ప్రాంతంలోని సకాకాలోని ఒక పొలంలో రహస్య భూగర్భ గిడ్డంగిలో దాచిన 1,882,198 యాంఫెటమైన్ మాత్రలను డ్రగ్ కంట్రోల్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లింగ్, ప్రమోషన్ నెట్వర్క్లపై సెక్యూరిటీ ఫాలో-అప్ కారణంగా డ్రగ్స్ రవాణాపై దాడులు చేసినట్టు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ నార్కోటిక్స్ కంట్రోల్ (జిడిఎన్సి) ప్రతినిధి మేజర్ మార్వాన్ అల్-హజ్మీ తెలిపారు. ఈ ఘటనలో నలుగురు అనుమానితులను, 3 సౌదీ పౌరులు, యెమెన్ నివాసిని అరెస్టు చేసినట్లు మేజర్ అల్-హజ్మీ వెల్లడించారు. అనుమానితులను పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేయడానికి ముందు వారిపై ప్రాథమిక చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. మక్కా, రియాద్, అల్-షార్కియా ప్రాంతాలలో 911 మరియు సౌదీ అరేబియాలోని మిగిలిన ప్రాంతాలలో 999 నంబర్కు కాల్ చేయడం ద్వారా డ్రగ్స్ స్మగ్లింగ్ లేదా ప్రమోట్ చేసే కార్యకలాపాల గురించి ఏదైనా సమాచారం రిపోర్ట్ చేయాలని ప్రజలను కోరారు. లేదా GDNC నంబర్: 995, ఇమెయిల్: [email protected]లో ద్వారా కూడా సమాచారం అందజేయవచ్చని సూచించారు.
తాజా వార్తలు
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...
- ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: కవిత
- ఈద్ అల్ అధా..HMC ఆపరేటింగ్ షెడ్యూల్ లో మార్పులు..!!
- కువైట్ లో 11,654 మంది కార్మికుల బదిలీలకు ఆమోదం..!!
- వైద్య సేవల కోసం మొదటి డ్రోన్ డెలివరీ అనుమతి జారీ..!!
- బౌషర్లో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి వెహికల్ చోరీ..!!
- వర్క్ ప్లేస్ లో కార్మికుడు మృతి..సూపర్వైజర్ కు జైలుశిక్ష..!!
- యూఏఈ, భారత్ సహా 38 దేశాల పౌరులకు శ్రీలంక గుడ్ న్యూస్..!!









