సనద్ బాలిక హత్య. కోర్టులో నేరాన్ని ఒప్పుకున్న బహ్రెయిన్ వ్యక్తి
- July 15, 2023
బహ్రెయిన్: సనద్లో కుళ్లిపోయిన బాలిక మృతదేహాన్ని కనుగొన్న కేసులో అరెస్టు చేసిన 35 ఏళ్ల బహ్రెయిన్ వ్యక్తి ఆమెను హత్య చేసినట్లు కోర్టులో అంగీకరించాడు. నాల్గవ హై క్రిమినల్ కోర్టులో విచారణ జరిగింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ అతనిపై హత్య, దాడికి పాల్పడినట్లు అభియోగాలు మోపింది. ఈ కేసులు నిరూపితమైతే14 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. తన చిత్రాలు మరియు వీడియోలతో తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, తన నుండి డబ్బు డిమాండ్ చేయడానికి వాటిని ఉపయోగించిందని అందుకే ఆమెను హత్య చేసినట్టు నిందితుడు కోర్టులో పేర్కొన్నాడు. తాను ఆమె మెడపై కొట్టిన తర్వాత ఆమె స్పృహతప్పి పడిపోయిందని, ఆమె నోరు మరియు ముక్కు నుండి రక్తం కారడం ప్రారంభమైందన్నాడు. అనంతరం ఆమె గొంతు పిసికి చంపినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. అనంతరం రోజంతా ఆమె మృతదేహాన్ని తన కారులో ఉంచానని, మరుసటి రోజు మృతదేహాన్ని సనద్ తీరానికి తీసుకెళ్లి, ఒక చెట్టు కింద పడేసి వచ్చినట్లు వివరించాడు. కోర్టు తదుపరి విచారణను జూలై 20కి వాయిదా వేసింది. సనద్లోని ఒక మారుమూల ప్రాంతంలో పాడుబడిన స్థితిలో బాలిక కుళ్ళిన మృతదేహాన్ని గతంలో అధికారులు గుర్తించారు. డీఎన్ఏ పరీక్ష ద్వారా బాధితురాలిని గుర్తించామని, సాక్ష్యులు, బాధితురాలి కుటుంబసభ్యుల వాంగ్మూలాలను ఉపయోగించి సందర్భానుసార సాక్ష్యాలను ఉపయోగించామని అధికారులు తెలిపారు. దర్యాప్తు సమయంలో క్యాపిటల్ గవర్నరేట్ ప్రాసిక్యూషన్ డిప్యూటీ చీఫ్, నేరస్థలం నుండి ఫోరెన్సిక్ నిపుణులచే నమూనాలు, కీలకమైన సాక్ష్యాలను సేకరించినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఇరాన్, లెబనాన్, ఇరాక్ ప్రయాణాలపై యూఏఈ నిషేధం..
- అల్ ఖువైర్ స్ట్రీట్ పాక్షిక మూసివేత..!!
- తెలంగాణలోని ఈ జిల్లాల్లో మూడ్రోజులు ఈదురుగాలులతో వర్షాలు
- వాడి బని ఖాలిద్లో వన్యపక్షులను వేటాడిన వ్యక్తులు అరెస్టు..!!
- మే 3 నుండి కార్డుల సేకరణ టైమింగ్ లో మార్పులు..!!
- కెనడా, కువైట్ విదేశాంగ మంత్రులతో సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- రూ.251కి చేరిన 1 BHD..రెమిటెన్స్ లో లాభాలు..!!
- ఆయుధాల స్మగ్లింగ్..13 మంది , 6 సంస్థలపై అభియోగాలు..!!
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు
- డా.పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం









