2.7 మిలియన్ల ప్రయాణికులతో షార్జా టాక్సీ రికార్డు..!
- July 15, 2023
యూఏఈ: షార్జా టాక్సీ 2023 మొదటి అర్ధభాగంలో 2.7 మిలియన్ల మంది ప్రయాణికులను రవాణా చేసి రికార్డులు సృష్టించింది. సగటున రోజుకు 15,000 మంది ప్రయాణికులు టాక్సీలలో ప్రయాణించారు. ముఖ్యంగా ఈద్ అల్-అధా సెలవుల సమయంలో 102,000 మంది ప్రయాణీకులు టాక్సీలను ఆశ్రయించారు. ఇది మునుపటి సంవత్సరం కంటే 20% అధికం కావడం గమనార్హం. షార్జా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో టాక్సీ వినియోగదారుల సంఖ్య కూడా ఈద్ సందర్భంగా రికార్డు స్థాయికి చేరుకుంది. మొత్తం 23,476 మంది ప్రయాణికులు షార్జా టాక్సీని విమానాశ్రయానికి వెళ్లడానికి , తిరిగి రావడానికి ఉపయోగించారని ఓసూల్ ట్రాన్స్పోర్ట్ సొల్యూషన్స్ యాక్టింగ్ జనరల్ మేనేజర్ ఖలీద్ అల్ కిండి తెలిపారు. షార్జా ట్యాక్సీ తన వాహనాల్లో 100% పర్యావరణ అనుకూల హైబ్రిడ్ వాహనాలుగా మార్చడానికి ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









