2.7 మిలియన్ల ప్రయాణికులతో షార్జా టాక్సీ రికార్డు..!
- July 15, 2023
యూఏఈ: షార్జా టాక్సీ 2023 మొదటి అర్ధభాగంలో 2.7 మిలియన్ల మంది ప్రయాణికులను రవాణా చేసి రికార్డులు సృష్టించింది. సగటున రోజుకు 15,000 మంది ప్రయాణికులు టాక్సీలలో ప్రయాణించారు. ముఖ్యంగా ఈద్ అల్-అధా సెలవుల సమయంలో 102,000 మంది ప్రయాణీకులు టాక్సీలను ఆశ్రయించారు. ఇది మునుపటి సంవత్సరం కంటే 20% అధికం కావడం గమనార్హం. షార్జా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో టాక్సీ వినియోగదారుల సంఖ్య కూడా ఈద్ సందర్భంగా రికార్డు స్థాయికి చేరుకుంది. మొత్తం 23,476 మంది ప్రయాణికులు షార్జా టాక్సీని విమానాశ్రయానికి వెళ్లడానికి , తిరిగి రావడానికి ఉపయోగించారని ఓసూల్ ట్రాన్స్పోర్ట్ సొల్యూషన్స్ యాక్టింగ్ జనరల్ మేనేజర్ ఖలీద్ అల్ కిండి తెలిపారు. షార్జా ట్యాక్సీ తన వాహనాల్లో 100% పర్యావరణ అనుకూల హైబ్రిడ్ వాహనాలుగా మార్చడానికి ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు
- నకిలీ సమ్మర్ ట్రావెల్ ఆఫర్ల పై అప్రమత్తంగా ఉండండి..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ట్యాక్స్ పెనాల్టీ మాఫీ పథకాన్ని పొడిగించిన సౌదీ అరేబియా..!!
- యునెస్కోలో సుల్తాన్ హైథమ్ చారిత్రక ప్రసంగం..!!
- రాయల్ యూనివర్శిటీ ఫర్ విమెన్ లో ఘనంగా 18వ స్నాతకోత్సవం..!!
- పాస్పోర్ట్, కాన్సులర్ సేవల రుసుములను సవరించిన ఎంబసీ..!!
- జూలై నెల పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- మే నెలలో QR1.73 బిలియన్ల విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలు..!!
- తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్!







