యూత్ అంబాసిడర్ల కార్యక్రమాన్ని ప్రారంభించిన ఒమన్
- July 16, 2023
మస్కట్: సాంస్కృతిక, క్రీడలు మరియు యువత మంత్రిత్వ శాఖ యూత్ అంబాసిడర్ల కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రాంతీయ, అంతర్జాతీయ ఫోరమ్లలో సమర్థవంతమైన భాగస్వామ్యం కోసం యువ జాతీయ సామర్థ్యాలను పెంపొందించే లక్ష్యంతో దీన్ని ప్రారంభించినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ప్రోగ్రామ్ కింద యువకులకు నాయకత్వం వహించడానికి, వారి లక్ష్యాలను మరియు ఒమన్ విజన్ 2040 లక్ష్యాలను సాధించడంలో సహాయపడే అవకాశాన్ని అందిస్తుందని యూత్ జనరల్ డైరెక్టరేట్ డైరెక్టర్ జనరల్ హిలాల్ బిన్ సైఫ్ అల్ సియాబీ తెలిపారు. యూత్ అంబాసిడర్స్ ప్రోగ్రామ్ 18 నుండి 25 సంవత్సరాల వయస్సు గల వారిని లక్ష్యంగా చేసుకుంటుందన్నారు. ప్రాంతీయ, ఒమన్ సుల్తానేట్కు ప్రాతినిధ్యం వహించడానికి అవసరమైన నైపుణ్యాలను యువతకు అందించడానికి ప్రయత్నిస్తుందని అన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణలో 4 రోజులు భారీ వర్షాల హెచ్చరిక
- ఫుజైరాలో విదేశీ మీడియా సంస్థ కోసం వీడియో షూట్..వ్యక్తి అరెస్టు..!!
- అక్రమ ఒబెసిటీ ఆపరేషన్స్..జెడ్డాలోని కేంద్రం సీజ్..!!
- Skytrax అవార్డులు, Expo నుండి వైదొలిగిన హమద్ ఎయిర్ పోర్ట్..!!
- ప్రాంతీయ పరిణామాలపై బహ్రెయిన్, జోర్డాన్ చర్చలు..!!
- ల్యాండ్ పోర్టుల ద్వారా నిరాటకంగా చేపల దిగుమతులు..!!
- వైమానిక దాడిలో ఇరాన్ భద్రతా చీఫ్ మృతి
- పర్యాటకులకు ఇష్టమైన ఈద్ విహార కేంద్రంగా ఒమన్..!!
- ప్రాంతీయ పరిణామాల పై యూఏఈ అధ్యక్షుడు, భారత ప్రధాని చర్చలు..!!
- ఐపీఎల్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్లు వీరే!









