2030 నాటికి 59 లాజిస్టిక్స్ జోన్ల ఏర్పాటు: సౌదీ అరేబియా
- July 16, 2023
సౌదీ అరేబియా: సౌదీ అరేబియా 2030 నాటికి 59 లాజిస్టిక్స్ జోన్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. లండన్లో జరిగిన రిసెప్షన్ సందర్భంగా సౌదీ ట్రాన్స్పోర్ట్ జనరల్ అథారిటీ ఈ మేరకు ప్రకటించింది. రిసెప్షన్లో యూకేలోని సౌదీ రాయబారి ప్రిన్స్ ఖలీద్ బిఎన్ బందర్ బిన్ సుల్తాన్, రవాణా మరియు లాజిస్టిక్ సేవల డిప్యూటీ మంత్రి, రవాణా జనరల్ అథారిటీ యాక్టింగ్ చైర్మన్ డాక్టర్ రుమైహ్ అల్-రుమైహ్, అలాగే పలువురు రాయబారులు, ప్రతినిధులు, ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ (IMO) సభ్యులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో సౌదీ రాయబారి మాట్లాడుతూ.. సముద్ర రంగం(మారిటైం సెక్టర్)లో సౌదీ అరేబియా సాధించిన అత్యుత్తమ విజయాలను వివరించారు. లాజిస్టిక్ సేవలలో గణనీయమైన అభివృద్ధి, ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్తో సన్నిహిత సహకారం, సముద్ర పర్యావరణానికి మద్దతుతో సహా సాధించిన విజయాలు సౌదీ అరేబియా తన ప్రతిష్టాత్మక లక్ష్యాలను సాధించే ప్రయాణంలో ఒక ముఖ్యమైన దశను సూచిస్తాయని ఆయన పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, రవాణా మరియు లాజిస్టిక్స్ కోసం జాతీయ వ్యూహం సముద్ర అభివృద్ధి అన్ని అంశాలలో స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించిందని డాక్టర్ అల్-రుమైహ్ నొక్కిచెప్పారు. 2030 నాటికి లాజిస్టిక్స్ పనితీరు (LPI) ఇండెక్స్లో మొదటి పది దేశాలలో ఒకటిగా ఉండాలని రాజ్యం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఇందులో 59 లాజిస్టిక్స్ జోన్ల స్థాపన, 40 మిలియన్ కంటే ఎక్కువ కంటైనర్లకు పోర్టుల సామర్థ్యాన్ని పెంచడం, సముద్ర పర్యావరణానికి మద్దతు ఇవ్వడంలో రాజ్యం గొప్ప పురోగతి సాధించిందని తెలిపారు. "ఇన్నోవేషన్ ఫర్ ఎ గ్రీన్ ఫ్యూచర్" అనే థీమ్తో సెప్టెంబరు 4-6, 2023 నుండి మారిటైమ్ ఇండస్ట్రీ సస్టైనబిలిటీ కాన్ఫరెన్స్ను నిర్వహిస్తున్నట్లు కూడా ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్పోర్ట్ జనరల్ అథారిటీ నిర్వహించిన ఎగ్జిబిషన్లో అనేక ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఏజెన్సీలు పాల్గొన్నాయి.
తాజా వార్తలు
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు
- నకిలీ సమ్మర్ ట్రావెల్ ఆఫర్ల పై అప్రమత్తంగా ఉండండి..దుబాయ్ పోలీసుల హెచ్చరిక







