'నీరు-ప్రగతి'లో దేశానికే ఆదర్శంగా రాష్ట్రాన్ని రూపొందిదాం
- May 16, 2016
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రవ్యాప్తంగా అధికారులు, ప్రజాప్రతినిధులతో ఈరోజు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. 'నీరు-ప్రగతి'లో దేశానికే ఆదర్శంగా రాష్ట్రాన్ని రూపొందిద్దామని ఈ సందర్భంగా చంద్రబాబు పిలుపునిచ్చారు.ఉపాధి హామీ కింద ఇప్పటి వరకు రూ.వెయ్యి కోట్లు ఖర్చుచేశామని, రాబోయే 45రోజుల్లో మరో రూ.వెయ్యి కోట్లు వ్యయం చేసేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
కృష్ణా, కర్నూలు, తూర్పుగోదావరి జిల్లాల్లో ఉపాధి హామీ పనుల్లో పురోగతి బాగుందని, శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఇంకా ముందంజ వేయాల్సి ఉందన్నారు. పంట సంజీవనిలో అనంతపురం, ప్రకాశం, చిత్తూరు జిల్లాలు ముందంజలో ఉంన్నాయని... శ్రీకాకుళం, కృష్ణా, విశాఖ, తూర్పుగోదావరి, నెల్లూరు జిల్లాలు మెరుగుపడాల్సి ఉందని సూచించారు.. ఈ ఏడాది ఎన్టీఆర్ జలసిరి కింద 6,21,745 ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చంద్రబాబు చెప్పారు. రాబోయే 45 రోజుల్లో 'నీరు-ప్రగతి' కార్యక్రమం ముమ్మరం చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..







